'గద్వాలను జిల్లాగా ప్రకటించాలి' | Sakshi
Sakshi News home page

'గద్వాలను జిల్లాగా ప్రకటించాలి'

Published Fri, Mar 4 2016 3:25 PM

Former MLA DK Bharata Simha Reddy supports relay strike in Gadwal

గద్వాల (మహబూబ్‌నగర్ జిల్లా) : గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే డి.కె.భరతసింహా రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని పేరుమైదానంలో జిల్లా సాధన సమితి సంఘం చేపట్టిన రిలే దీక్షలు 20 వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం నాయీబ్రాహ్మణుల రిలే దీక్షకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు గద్వాలకు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మావతి, జానకిరాములు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement