కరీంనగర్ అగ్రికల్చర్ : ఏడుగంటలున్న కరెంటు సరఫరాను 4 గంటలకు కుదించారు. 5 గ్రూపులుగా విభజించి రాత్రి పూట ఇస్తున్న త్రీఫేజ్ కరెంటుపై రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇచ్చే నాలుగు గంటలలోనూ అంతరాయం, మరమ్మతులు, కోతలతో అరిగోసపడుత ున్నారు. లోవోల్టేజీతో మోటార్లు కాలిపోవడం మరో సమస్యగా మారింది. వర్షాలు పడే నైరుతి వెళ్లిపోయింది. ఎండలు కాస్తున్నాయి. వరిపొలాలు పొట్టదశలో ఉండడంతో నీరు తప్పనిసరి. పొలానికి ఏకధాటిగా నీరు పెడితేనే కిందిమడికి నీరందుతుంది. ఇస్తున్న నాలుగు గంటలు వేళాపాలా లేని సరఫరాతో ఆరుతడి పంటలకు సైతం నీరు పారించలేకపోతున్నారు. దీంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా సంబంధిత అధికారులు దృష్టికి రాకపోవడం గమనార్హం.
సాగు.. సాధారణం
జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 5.40 లక్షల హెక్టార్లుకాగా.. 6 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాధారణ విస్తీర్ణంలోనే వివిధ పంటలు సాగు చేశారు. 1.61 లక్షల హెక్టార్లలో వరి, 53,622 హెక్టార్లలో మొక్కజొన్న, 2.23 లక్షల హెక్టార్లలో పత్తి, 19,385 హెక్టార్లలో సోయాబీన్ సాగవుతోంది. కాల్వనీళ్లు రానందున పంటలన్నీ బావులు, బోర్ల ఆధారితంగా మోటార్ల సాయంతోనే పండిస్తున్నారు. జిల్లాలో 3.63 లక్షల విద్యుత్ కనెక్షన్లతోపాటు అనధికారికంగా మరో 25 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు పంటలను కాపాడుకున్నది ఒక వంతైతే..ఆ పంటలను చేతికందించేందుకు అక్టోబర్, నవంబరు నెలలో నీటిని పారించడం అత్యంత కీలకం. ఈ సమయంలోనే సగానికి సగం విద్యుత్ సరఫరా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ కాలం ముగిసినప్పటికీ విద్యుత్కోతలు రబీని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
రాత్రి కరెంటుతో ఇక్కట్లు
ఆరుతడి పంటలకు రాత్రి పూట నీరు పారించలేక రైతులు తండ్లాడుతున్నారు. విద్యుత్తు ప్రమాదాలు, పాములతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పంటలకు నీటిని పారిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ మండలం ఆసిఫ్నగర్లో తండ్రీకొడుకులు రాత్రిపూట నీరు పెట్టేందుకు విద్యుత్షాక్తో మరణించారు. వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరాను 5 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపునకు 4 గంటల చొప్పున సరఫరా ఇస్తుండగా.. డి-గ్రూపునకు రాత్రి 10 నుంచి 2గంటల వరకు, ఇ-గ్రూపునకు రాత్రి 2నుంచి 6 గంటల వరకు సరఫరా ఇస్తున్నారు. ప్రతీ వారం గ్రూపు మారుతుంది. అంటే ఐదు గ్రూపులకు 5 వారాలుంటే మూడు వారాలు పగటిపూట, 2 వారాలు పూర్తిగా రాత్రిపూట ఇవ్వడంతో రైతులు పొలాలవద్ద పడిగాపులు కాస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ లోటున్నప్పటికీ రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ విద్యుత్ వేళలు పెంచేందుకు సర్కారుతో పాటు అధికారయంత్రాంగం ఆలోచించాల్సి ఉంది.
ఉత్పత్తి లేకే కోతలు..
- గంగాధర్, ట్రాన్స్కో డీఈ
తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో లోటు ఏర్పడింది. ఫలితంగా కరెంటు కోతలు అనివార్యమయ్యాయి. 5 గ్రూపులుగా కరెంటు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో విద్యుత్తు కొనుగోలుకు జరుగుతున్న చర్యలు అమలు జరిగితే రబీ సీజన్లో విద్యుత్ లోటును పూడ్చవచ్చు. ఇప్పటికే పరిశ్రమలకు 2 గంటల విద్యుత్ కోత, మండలాలు, మున్సిపాలిటీలు, సబ్స్టేషన్ పరిధిలో 8 గంటల చొప్పున కోతలున్నాయి. జిల్లా కేంద్రంలో 6 గంటల విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాం.
రైతన్నకు గుండె ‘కోత’
Published Thu, Oct 2 2014 3:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement