- వింత వ్యాధితో బాలుడి అవస్థలు
- వైద్యం కోసం రూ.6.50లక్షలకుపైగా ఖర్చు
- ఆస్తులు అమ్మినా నయంకాని జబ్బు
- ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
భేతాళపాడు(జూలూరుపాడు) : లేడిపిల్లలా గెంతాల్సిన పిల్లాడు నరకయూతన అనుభవిస్తున్నాడు.. వింత వ్యాధితో మంచానికే పరిమితమయ్యూడు.. కొడుకు ఆరోగ్యం బాగు చేరుుంచేందుకు ఆ తల్లిదండ్రులు ఉన్న ఆస్తిని అమ్మి వైద్యానికి ఖర్చు చేశారు.. కూలీ పనులకు వెళుతూ వచ్చిన డబ్బులతో మందులు తెస్తున్నారు.. దాతలు సాయం అందిస్తే కొడుకుకు పెద్దాస్పత్రిలో వైద్యం చేరుుస్తామని వేడుకుంటున్నారు. భేతాళపాడుకు చెందిన తూము నాగశంకర్, ఉపేంద్ర దంపతులకు ఇద్దరు సంతానం. రెండేళ్ల క్రితం పెద్ద కూతురుకు మూర్ఛ వ్యాధి రావడంతో ఆమె వైద్యానికి రూ.1.50లక్షలు ఖర్చు చేశారు. అదే సమయంలో రెండో సంతానమైన కొడుకు జస్వంత్కు 15 నెలల వయసులో ఫిట్స్ వ్యాధి వచ్చింది. దీంతో అనారోగ్యానికి గురయ్యూడు.
నాటి నుంచి నేటి వరకు కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం కోసం సుమారు రూ.6.50లక్షలు ఖర్చు చేశారు. అరుునా జస్వంత్ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఏ వ్యాధి సోకిందనే విషయం కచ్చితంగా నిర్ధారణ కాకపోవడం తో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ రావడంతో అనారోగ్యానికి గురయ్యూడని వైద్యులు చెప్పినట్లు బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటివరకు 140 టెస్టులు చేసినా వ్యాధి నిర్ధారణ కాలేదంటున్నారు. జస్వంత్కు తరచూ జ్వరం, వణుకుడు రావడం, నాలుగేళ్ల వయసు వచ్చినా మాట్లాడలేకపోవడం, నిలబడలేక, శరీరం సహకరించకపోవడంతో మంచానికి పరిమితం కావాల్సి వస్తోంది. ప్రతి నెలా బాలుడికి రక్తం ఎక్కించడంతోపాటు వైద్యం కోసం సుమారు రూ.15వే నుంచి రూ.20 వేల ఖర్చు చేయాల్సి రావడంతో తల్లిదండ్రులకు భారంగా మారింది.
జస్వంత్ వైద్యం కోసం ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిని, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు, జత దుక్కిటెద్దులు, ఎడ్ల బండితోపాటు విలువైన బంగారు నగలు సైతం అమ్మారు. కొడుకు ఆరోగ్యం కోసం 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసినా ఫలితం లేకపోవగా అప్పులు పాలైనట్లు బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం నాగశంకర్, ఉపేంద్ర దంపతులు ఓ రేకుల షెడ్లో తలదాచుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించగా.. తర్వాత వర్తించదని చెప్పడంతో లక్షలాది రూపాయలు ఆస్పత్రిలో చెల్లించాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రస్తుతం ఆ దంపతులు కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల నుంచి జస్వంత్ వైద్యం కోసం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆ బాలుడి ఆరోగ్యం క్షీణిస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాతలు ముందుకొచ్చి తమ కొడుకును కాపాడాలని వేడుకుంటున్నారు. అలాగే సీఎం కేసీఆర్ స్పందించి తమ కొడుకును ఆదుకోవాలని బాలుడి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేయూల్సిన దాతలు 95501 92646 నంబర్లో సంప్రదించాలని, బ్యాంకు అకౌంట్ నం.62417429913 లో నగదు జమ చేయూలని వారు కోరారు.
నాలుగేళ్లకే నరకయూతన!
Published Sun, Sep 13 2015 4:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
Advertisement