గరీబోళ్ల ఇళ్ల స్థలాలపై గద్దలు వాలాయి. ఇందిరమ్మ ఇళ్ల మాటున భూ బకాసురులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కాసులు కురిపించే పారిశ్రామిక వాడను అడ్డగా చేసుకొని భూ దందాకు పక్కా ప్లాన్ వేశారు. గూడులేని నిరుపేదలకు ఇవ్వాల్సిన స్థలాలను నాయకులు అక్రమంగా అమ్ముకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట కళ్లు తిరిగే మోసానికి పాల్పడ్డారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం మండలంలోని బొల్లారం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం జిన్నారం మండలం హెచ్ఎండీఏ పరిధిలోకి ఉంది. అందువల్లే ఇక్కడి భూముల ధరలు చుక్కల్లో ఉంటాయి. అయినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు బొల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీఓను తీసుకువచ్చింది.
2008లో మూడో విడత ఇందిరమ్మ పథకం ద్వారా బొల్లారంలోని 284 సర్వేనంబర్లో గల 25 ఎకరాల స్థలాన్ని ఇళ్లకు కేటాయిస్తూ అనుమతి ఇచ్చింది. అప్పటి మంత్రి సునీతారెడ్డి చేతుల మీదుగా ఒక్కో లబ్ధిదారునికి 80 గజాల చొప్పున 1,075 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను అందించారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు కొన్ని పట్టాలను తమ అనుకూలమైన వారికిచ్చి, మరికొన్ని పట్టాలను అమ్ముకొని రూ.కోట్లలో ఆర్జించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇళ్ల స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నోసార్లు ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రతిపక్షాల వేదన అరణ్యరోదనగానే మారిపోయింది.
సర్కార్ మార్పుతో మారిన సీన్
తాజాగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్ నాయకుల అక్రమాలపై అసలైన లబ్ధిదారులు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆర్డీఓతో విచారణ చేయించారు. నెల రోజులపాటు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 1,075 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే, అందులో కేవలం 308 మంది మాత్రమే అర్హులని అధికారులు నిర్ధారించారు. మిగతా 767 పట్టాలను అక్రమార్కులు కొట్టేసినట్లు అనుమానిస్తున్నారు. అక్రమార్కులు ఒక్కో పట్టాను డిమాండ్ను బట్టి రూ. లక్ష నుండి రూ.2 లక్షల ఆపైగా విక్రయించినట్లు తెలిసింది. 1,075 మంది లబ్ధిదారులకు ఇచ్చిన సర్టిఫికెట్లలో 1,053 సర్టిఫికెట్లకు సంబంధించిన ప్లాట్లను మాత్రమే అధికారులు గుర్తించారు. మిగతా 22 ప్లాట్లకు సంబంధించిన స్థలాన్ని అధికారులు కూడా గుర్తించలేకపోయారు.
ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలను రెవెన్యూ అధికారులు జిల్లా అధికారులకు పంపారు. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో బొల్లారం కాంగ్రెస్ నేతలు ఇళ ్ల స్థలాల కేటాయింపుల్లో అక్రమాలు జరిపారనే అరోపణలు ఉన్నాయి. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇంతవరకూ చర్యలు తీసుకోలేకపోయారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల క్రయ, విక్రయాలు జరపకూడదనేనిబంధనలు ఉన్నా, ఇక్కడి నేతలు మాత్రం ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను యథేచ్ఛగా విక్రయించేసుకుంటున్నారు.
బొల్లారం హెచ్ఎండీఏ పరిధిలో ఉండడంతో ఇతర ప్రాంతాలు, పట్ట ణాల వారు ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భూమాయగాళ్లు వారికి మాయ మాటలు చెప్పి ప్రభుత్వం కేటయించిన ఇళ్ల స్థలాలను విక్రయిస్తున్నారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని బొల్లారం ప్రాంత వాసులు కోరుతున్నారు.
గరీబోళ్ల గూడుపై రాబందులు
Published Thu, Oct 16 2014 11:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement