‘డయాలసిస్ రోగులకు ఉచిత బస్‌పాస్’ | Sakshi
Sakshi News home page

‘డయాలసిస్ రోగులకు ఉచిత బస్‌పాస్’

Published Sun, Mar 15 2015 3:50 AM

Free bus pass for Dialysis patients

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్ రోగులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కొందరు బాధితులు చేసిన విన్నపం మేరకు ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లానని... సీఎం బస్‌పాసులివ్వడానికి సుముఖత వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే దాదాపు 5 వేల మంది డయాలసిస్ రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
 

Advertisement
Advertisement