* 89 చెరువులకు రూ.24.19 కోట్లు విడుదల
* ‘పునరుద్ధరణ’కు మూడుసార్లు నోటిఫికేషన్
* అయినా ముందుకు రాని కాంట్రాక్టర్లు
* వెంటాడుతున్న పర్సెంటేజీల భయం
* ఆయా పనులపై ప్రజాప్రతినిధుల కన్ను
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘మిషన్ కాకతీయ’కు బాలారిష్టాలు తప్పడం లేదు. మంత్రి మాటలు, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణ పనులపై కొందరు ప్రజాప్రతినిధులు కన్నేయడంతో, కాంట్రాక్టర్లను ‘పర్సెంటేజీ’లు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిధులు విడుదలైనాటెండర్లు జరగడం లేదు. ఈ కార్యక్రమం కింద జిల్లాలో మొత్తం 3,251 చెరువులు, కుంటలలో మొదటి విడతగా చేపట్టే 701 పనుల అంచనాల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
356 చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన అంచనాలను స్వీకరించిన ప్రభుత్వం 89 చెరువుల పనులను తక్షణమే మొదలు పెట్టాలని రూ.24.19 కోట్లు విడుదల చేసింది. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్ల పరిధిలోని ఈ పనులను చేపట్టేందుకు నీటిపారుదలశాఖ అధికారులు ఇప్పటికీ మూడు పర్యాయాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ-టెండర్ల ద్వారా పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
చెరువు పనులు లాభదాయకంగా ఉన్నా ఎందుకు ముందుకు రావడం లేదని ఆరా తీస్తే, అధికారులు సైతం పెదవి విప్పడం లేదు. కొం దరు ప్రజాప్రతినిధులు పనులు మొదలెట్టే ముందు ‘మమ్మ ల్ని కలవాల్సిందే’ అంటూ ఆర్డర్లు వేయడంతోనే చెరువుల పనులపై మొగ్గు చూపడం లేదంటూ కాంట్రాక్టర్లు చర్చించుకుంటుండటం ఆసక్తికరంగా మారింది.
ఇదీ పరిస్థితి
మొదటి విడతగా 701 చెరువుల పనులను ఈ ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్లలో సర్వే చేసి అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కలిగేలా అంచనాలు తయారు చేయాలని డిసెంబర్ ఐదున మంత్రి హరీష్రావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించారు. అంతకు ముందు నుంచే నీటి పారుదల శాఖ 456 చెరువులు, కుంటలను సర్వే చేసి 356 చెరువులు, కుంటలపై రూ.131.19 కోట్ల అంచనా వ్యయం (ఎస్టిమేట్ కాస్ట్)కు సం బంధించిన రికార్డులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు ప్రతి జిల్లాలో 20 శాతం చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులను 2015 మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో వివిధ కారణాల చేత చెరువుల పనుల ఎస్టిమేట్లు ఆశించిన రీతిలో ముందుకు సాగకపోగా, 89 చెరువుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.24.19 కోట్ల పనుల ఖరారుకు కొం దరు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లకు మోకాలడ్డుతుండటం తో ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదన్న చర్చ ఉంది.
రూ. 24.19 కోట్ల పనులకు కోసం మూడు పర్యాయాలు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈ-టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదంటే, చెరువుల పునరుద్ధరణ పనులపై ప్రజాప్రతి నిధుల పాత్ర ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే నిధులు విడుదలైన చెరువుల పునరు ద్ధర ణ ఎలా పూర్తవుతుంది? 345 చెరువుల ఎస్టిమేట్లు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎస్టిమేట్లు సమర్పించి సిద్ధంగా ఉన్న మిగిలిన 256 చెరువులకు నిధులు ఎప్పుడిస్తారు? టెండర్లు ఎలా చేపడుతారు? మార్చిలోగా మొదటి విడత చెరువుల పునరుద్ధరణ ఎలా సాధ్యం? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుకు సాగని ‘మిషన్ కాకతీయ’
Published Fri, Jan 23 2015 3:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement