ఆదిలాబాద్, న్యూస్లైన్ : ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్ఎస్ఏ) విద్యుత్ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. కొన్నేళ్ల కిందట వినియోగించిన విద్యుత్కు సంబంధించి ఇంధన సర్దుబాటు చార్జీలు విద్యుత్ పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చార్జీలపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వాలు, విద్యుత్ పంపిణీ సంస్థలు తమ పంథా కొనసాగిస్తున్నాయి. తాజాగా 2011 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వినియోగించిన విద్యుత్కు సంబంధించి సర్దుబాటు చార్జీలను ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వసూలు చేస్తున్నారు.
యూనిట్కు 95 పైసలు..
గతంలో వినియోగించిన విద్యుత్కు సం బంధించి ఉత్పత్తి ఖర్చు, బిల్లుల రూ పంలో వసూలైన మొత్తానికి తేడాను విని యోగదారులపై సర్దుబాటు చార్జీల రూ పంలో ప్రభుత్వం వసూలు చేస్తుంది. మూడేళ్ల కిందట వాడుకున్న కరెంట్కు సంబంధించి ఈ సంవత్సరంలో బిల్లులు వసూలు చేస్తుండడంపై వినియోగదారు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం ద్వారా వందల కోట్ల రూపాయలు జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు కంపెనీకి చెల్లించారు. కాగా ఈ ఏ ప్రిల్ నెల బిల్లులో 2011 అక్టోబర్కు సం బంధించిన సర్దుబాటు చార్జీలను విని యోగదారులపై రుద్దటం జరిగింది. ఈ మే నెలలో నవంబర్ 2011, జూన్లో డిసెంబర్ 2011 సంబంధించిన సర్చార్జీలను వేయనున్నారు. ఏప్రిల్ బిల్లులో వినియోగదారులపై రూ.4.28 కోట్లు అదనపు భారం మోపారు.
అప్పట్లో లో టెన్ష న్ కనెక్షన్లపై 42.981 మిలియన్ యూని ట్లు, హైటెన్షన్ కనెక్షన్లపై 46.286 మిలి యన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగిం ది. ప్రతి యూనిట్పై 94.87 పైసలు సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేయాలని ఎన్పీడీసీఎల్ అధికారుల నుంచి ఇ దివరకే ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మూడు నెలలకు సంబంధించి వినియోగదారులపై సుమారు రూ.12.50 కోట్లు భారం పడనున్నట్లు అధికారులు పేర్కొం టున్నారు. కాగా వినియోగదారుల నుం చి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానుల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గతంలో ఎవరో అద్దెకు ఉండగా ప్రస్తుతం ఇతరుల రావడం, వారు బిల్లులో సర్దుబాటు చార్జీల విషయంలో కట్టేందుకు వెనుకంజ వేస్తుండడం ఇంటి యజమానులకు గుదిబండగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ విధానాన్ని మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇంధన సర్దుబాటు చార్జీలు
Published Mon, May 26 2014 12:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
సీఎం సభకు సర్వం సిద్ధం
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement