సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి దిగువకు వస్తున్న ప్రవాహాలతో రాష్ట్ర ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటితో పూర్తిస్థాయి సాగు అవసరాలను తీర్చే అవకాశాలు లేకున్నా, తాగునీటి గండం నుంచి మాత్రం గట్టెక్కే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అవసరాలకు పెద్దదిక్కుగా ఉన్న సాగర్లోకి స్థిరంగా ప్రవాహాలు వస్తుండటం, ఎగువ శ్రీశైలానికి భారీ ప్రవాహాలు కొనసాగుతుండటం రాష్ట్రానికి ఉపశమనమిస్తోంది.
మిషన్ భగీరథకు ఢోకాలేదు
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం, కడెం, సింగూరు వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు 727.39 టీఎంసీలు కాగా ప్రస్తుతం 438.9 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఇందులో ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు దిగువన 168 టీఎంసీలు ఉండాల్సిందే. శ్రీశైలంలో ఏపీ వాటా మరో 100 టీఎంసీలు, ఆవిరి నష్టాలు మరో 20 టీఎంసీలను పక్కన పెట్టినా, గరిష్టంగా 150 టీఎంసీల రాష్ట్ర వాటా ఉన్నట్టే. ఇందులో ఇప్పటికే సాగు ప్రాజెక్టులకింద ఉన్న తాగునీటి కేటాయింపులు 40 నుంచి 50 టీఎంసీల వరకు ఉన్నాయి. ఇక మిషన్ భగీరథ కింద ఈ ఏడాది జనవరి నుంచి 60 టీఎంసీల అవసరాలు ఉండనున్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద వచ్చే జూలై వరకు మిషన్ భగీరథకు 16 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు మరో 16 టీఎంసీలు, కల్వకుర్తి కింద 5 టీఎంసీల మేర అవసరం ఉంది. ప్రస్తుతం సాగర్లో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన 13 టీఎంసీల నీటి లభ్యత ఉంది.
అయితే ఎగువన వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలంలోకి 1.21లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 181 టీఎంసీలకు చేరింది. ఇక్కడ లభ్యతగా ఉన్న నీటిని అవసరానికి తగ్గట్టు ప్రస్తుతం తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలానికి వస్తున్న ప్రవాహాలతో మరింత నిల్వలు పెరిగితే వాటా ప్రకారం సాగర్నుంచి గరిష్టంగా 70 నుంచి 80 టీఎంసీల వాటా అయినా దక్కే అవకాశం ఉంది. ఈ నీటితో వచ్చే ఏడాది వరకు తాగునీటి కష్టాలను సమర్ధంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక గోదావరి బేసిన్ పరిధిలోని సింగూరు, ఎల్లంపల్లి, కడెంలు పూర్తి స్థాయి మట్టాలకు చేరుకున్నాయి. ఎస్సారెస్పీలో అనుకున్న మేర నీటి నిల్వలు చేరకున్నా, ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న 37.38 టీఎంసీల నీటితో తాగునీటి అవసరాలకు ఢోకాలేదు. ఒక్క నిజాంసాగర్ ప్రాజెక్టు కింది తాగునీటి అవసరాలకు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సింగూరుకు మరిన్ని ప్రవాహాలు కొనసాగితే, అక్కడి నుంచి నిజాంసాగర్కు నీటి విడుదల జరిగే ఆస్కారం ఉంది. అదే జరిగితే ఇక్కడి అవసరాలు సైతం తీరుతాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.
Published Wed, Oct 4 2017 2:48 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement