అగ్రవర్ణాల చేతిలోనే రాజ్యాధికారం | Sakshi
Sakshi News home page

అగ్రవర్ణాల చేతిలోనే రాజ్యాధికారం

Published Mon, Feb 19 2018 2:33 AM

gaddar on Constitutional authority - Sakshi

నర్సంపేట: రాష్ట్రంలో 93 శాతం ఉన్న బడుగులకు రాజ్యాధికారం లేదని, కేవలం 7 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతిలోనే అధికారం ఉందని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. ఆదివారం వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర ప్రథమ మహాసభలు ప్రారం భమయ్యాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని 43 సంవత్సరాలు కాంగ్రెస్, 17 సంవత్సరాలు తెలుగుదేశం, మూడున్నర సంవత్సరాలు టీఆర్‌ఎస్‌ పార్టీలు పాలిస్తే బీసీ ముఖ్యమంత్రి అధికారాన్ని చేపట్ట లేకపోయారని పేర్కొన్నారు. రాష్ట్ర పత్రికా రంగాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని, జర్నలిస్టులకు నెలకు కనీస వేతనం రూ.30వేలు చెల్లించడంతోపాటు 13వేల మంది ప్రజాప్రతినిధులకు పెన్షన్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement