- బయటకు చెబితే చంపుతామని బెదిరింపులు
- ఈ నెల 4న ఘటన 13 రోజుల తర్వాత వెలుగులోకి..
భీమదేవరపల్లి: నానమ్మతో కలసి నిద్రిస్తున్న యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెబితే చంపుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు జరిగిన సంఘటన ఎవరికీ చెప్పుకోలేక 13 రోజులుగా కుమిలిపోరుుంది. విషయం బయటకు పొక్కడంతో గ్రామపెద్దలు సైతం కేసు కాకుండా బేరసారాలు నడిపారు. పోలీసులకు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హసన్ పర్తి సీఐ రవి కుమార్, ముల్కనూర్ ఎస్సై సంతోష్కుమార్ కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన 21 ఏళ్ల యువతి డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులు చదివే ఆర్థిక స్థోమత లేకపోవడంతో , కుటుంబ పోషణ నిమిత్తం కూలీ పని చేస్తోంది. సదరు యువతి తల్లిదండ్రులు 15 ఏళ్ల క్రితమే మృతి చెందారు.
యువతి అక్కకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. దీంతో ఆమె తన నానమ్మ వద్ద ఉంటుంది. ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిట్టల నరేశ్ కొద్ది రోజులుగా యువతితో స్నేహంగా ఉంటున్నాడు. యువతి నానమ్మ ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆటోలో ఆమెను అప్పుడప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లేవాడు. ఈ నెల 4న రాత్రి 9 గంటల ప్రాంతంలో నరేశ్ యువతికి ఫోన్ చేసి తనకు రూ. 500 కావాలి.. ఇంటికి వస్తున్నానని చెప్పాడు. అతడికి సదరు యువతి డబ్బులివ్వడంతో నరేశ్, అతడి స్నేహితులు బస్వ శ్రీకాంత్, పోలు ప్రేమ్కుమార్ మద్యం తాగారు. అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు శ్రీకాంత్ తన సెల్ నుంచి యువతికి ఫోన్ చేశాడు.
అనంతరం సుమారు ఒంటి గంట ప్రాంతంలో నరేశ్, శ్రీకాంత్, ప్రేమ్కుమార్లు యువతి ఇంటికెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికై నా చెబితే చంపుతామంటూ బెదిరించారు. భయపడి విషయం ఎవరికి చెప్పకుండా యువతి భయంతో గడిపింది. వారం అనంతరం విషయం బయటకు రావడంతో గ్రామ పెద్దలు రాయబేరాలు నడుపుతున్నారు. అయితే, సామూహిక అత్యాచారం జరిగినట్లు సోమవారం రాత్రి పోలీసులకు తెలియడంతో వెలుగులోకి వచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు ప్రేమ్కుమార్, శ్రీకాంత్, నరేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కాగా సదరు యువతిని హోమ్కు తరలించారు. విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించిన పెద్దలపై కేసు నమోదు కానున్నట్లు సమాచారం. ముగ్గురు యువకులు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
యువతిపై సామూహిక అత్యాచారం
Published Tue, Oct 18 2016 3:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement