బోరుబావి నుంచి క్షేమంగా బయటపడిన బాలిక | Sakshi
Sakshi News home page

బోరుబావి నుంచి క్షేమంగా బయటపడిన బాలిక

Published Tue, Jan 13 2015 9:57 PM

girl safely from rescued from borewell in rangareddy district

గండేడు: రంగారెడ్డి జిల్లాలో గండేడు మండలం గోవింద్పల్లి తండాలో బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలిక అంజలి క్షేమంగా బయటపడింది. ఆమెను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశారు. 108 వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

సాయంత్రం 6 గంటల సమయంలో ఆడుకుంటూ చిన్నారి 10 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. బోరుబావి లోతు తక్కువ ఉండడంతో పాపకు ప్రమాదం తప్పింది. పాప క్షేమంగా బయటపడడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement