వరద ప్రవాహ లెక్కలు ఇప్పించండి | Sakshi
Sakshi News home page

వరద ప్రవాహ లెక్కలు ఇప్పించండి

Published Wed, Dec 6 2017 1:29 AM

Give flood flow calculations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని బ్యారేజీ, రిజర్వా యర్ల పరిధిలో నమోదవుతున్న నీటి ప్రవాహ లెక్కలను ఏపీ సమర్పించడం లేదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టికి తెలంగాణ తీసుకెళ్లింది. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఏపీ జలసౌధ నుంచి ఎలాంటి సమాచారం లేకుండా ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను తీసేశారని, అప్పటి నుంచి ప్రవాహ లెక్కల వివరాలు ఇవ్వడం లేదని తెలిపింది. మంగళవారం ఈ మేరకు బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది.

గతంలో రెండు రాష్ట్రాల అధికారులు వరద నిర్వహణను పర్యవేక్షించి, సంబంధిత అధికారులకు వివరాలు సమర్పించే వారని, అయితే గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి అలాంటిదేమీ జరగడం లేదన్నారు. ఈ దృష్ట్యా ఇప్పటికైనా ఈ వివరాలను సంబంధిత తెలంగాణ అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేసేలా చూడాలని బోర్డును కోరారు. దీనిపై వెంటనే స్పందించిన బోర్డు.. వరద ప్రవాహ వివరాలను ఎప్పటికప్పుడు పంపేలా చర్యలు తీసుకోవాలని ఏపీని ఆదేశించింది. బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌పై తక్షణమే స్పందించాలని బోర్డు ఏపీని ఆదేశించింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాసింది. ఈ నెల 12లోగా స్పందించాలని కోరింది. 

Advertisement
Advertisement