Sakshi News home page

గోదావరి వద్ద వరద ఉధృతి తగ్గుముఖం

Published Tue, Sep 9 2014 11:03 AM

Godavari flood water level  decreased at Bhadrachalam

ఖమ్మం : ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. రాత్రి నుంచి ఇప్పటివరకూ రెండు అడుగుల మేర వరద ప్రభావం తగ్గింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 53.7 అడుగులు ఉంది.  మరోవైపు మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

కాగా గోదావరి పరివాహక గిరిజన గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముంపు బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.  గోదావరి వరద ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండటంతో జాతీయ విపత్తుల బృందం రంగంలోకి దిగింది. నలభై సభ్యులు గల ఈ బృందం భద్రాచలం చేరుకుంది.

Advertisement

What’s your opinion

Advertisement