- బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
- ప్రజాసమస్యల్ని గాలికొదిలారు..
- జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫైర్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వానికి కూల్చివేతలు, కట్టడాలపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే.. వాటి గొంతు నొక్కేయడం దారుణమని మండిపడింది. కరువుతో వందలాది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం హేయమని విమర్శిం చింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుం బాలకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం, సుధీర్రెడ్డి తదితరులు హాజరయ్యారు.
పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కలెక్టరేట్కు తరలివచ్చారు. గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో వారిని అరెస్టు చేశారు. పలువుర్ని నాంపల్లి స్టేషన్కు తరలించిన తర్వాత విడుదల చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోలేదని అన్నారు.
నియంత పాలన సాగుతోంది: ప్రసాద్కుమార్
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మాజీ మంత్రి ప్రసాద్కుమార్ విమర్శించారు. ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ప్రజాప్రతినిధులను అణచివేసేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. ప్రజాసమస్యలపై అన్నిపార్టీలతో కలిసి ఉద్యమించి టీఆర్ఎస్ మెడలు వంచుతామన్నారు.
డిజైన్ మారిస్తే యుద్ధం చేస్తాం : టీఆర్ఆర్
రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజల దాహార్తి తీర్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాణ హిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, బృహత్తర లక్ష్యంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం పూటకోమాట మారుస్తోందన్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీఎం చేసిన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని, ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. డిజైన్ మారిస్తే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ధర్నాలో కాంగ్రెస్ జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు జంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి ఉద్దెమర్రి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు ఆత్మహత్యలు పట్టవా?
Published Mon, Sep 7 2015 11:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement