సాక్షి, హైదరాబాద్: ‘అసోంలో ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నా సోదరుడిని ఆఫీసులోనే బాంబు పేల్చి పొట్టనబెట్టుకున్నారు. నాకు ధైర్యం ఉండి ఉంటే అప్పుడే తుపాకీ పట్టేవాడిని. అదే జరిగి ఉంటే ఉగ్రవాదినని నా కోసం పోలీసులు లుక్ఔట్ నోటీసు ఇచ్చి ఉండేవారు’అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తన సోదరుడి హత్య కేసును సీబీఐ, కోర్టులు దర్యాప్తు చేసినా నిందితులందరూ శిక్ష పడకుండానే తప్పించుకున్నారని, ఇలాంటి సందర్భాల్లోనే న్యాయం లభించినట్లు కనబడాలని, సత్వర తీర్పుల ద్వారా న్యాయం గెలిచిందనే భావన ప్రజలకు తెలియాలని చెప్పారు. సమాజ శ్రేయస్సులో న్యాయ వ్యవస్థది కీలకపాత్ర అన్నారు. శనివారం హైదరాబాద్ శివారులోని షామీర్పేట నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్వర న్యాయం లభించడం లేదని చాలా మంది విమర్శిస్తుంటారని, వాస్తవానికి కోర్టుల్లో పని భారం ఎక్కువగా ఉందని చెప్పారు. ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టుల్ని భర్తీ చేయాలన్నారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలకు చేయదలిస్తే.. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కొన్ని నిర్ణయాల వల్ల కొద్ది మంది నష్టపోవచ్చని, కానీ ఇలాంటి సందర్భాల్లో విస్తృత సమాజ శ్రేయస్సు ముఖ్యమన్నారు.
రాజ్యాంగానికి రక్షణ కవచం న్యాయ వ్యవస్థ
లా పట్టాలు పొంది బయటకు వెళుతున్న విద్యార్థులకు అనేక సవాళ్లు ఎదురవుతాయని.. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని గవర్నర్ సూచించారు. దేశ ప్రధాని (ఇందిరాగాంధీ పేరు ప్రస్తావించలేదు) హత్య జరిగినపుడు నిందితుల తరఫున ఎందుకు వాదించాలని ప్రశ్నించే వారుంటారని, వారి వాదన చెప్పుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని అన్నారు. ‘డబ్బున్న నిందితుడికి గుండెపోటు వస్తే ఆస్పత్రిలో చేరుస్తారని, పేదవాడికి జైలులోనే వైద్యం చేస్తారని, కొన్ని కేసుల్లో మీడియా చూపించే వార్తలు న్యాయ విచారణపై ప్రభావం చూపుతున్నాయని, ఇలా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ఎంతో మంది ప్రశ్నలు వేస్తారు. కానీ క్షేత్ర స్థాయిలో నిజానిజాలు బేరీజు వేసుకుని నైతిక విలువలకు కట్టుబడి పని చేయాలి’అని విద్యార్థులకు సూచించారు. రాజ్యాంగానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉందని.. అది దెబ్బతింటే అరాచకాలు, అన్యాయాలు పెరిగిపోతాయన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా చివరికి కోర్టుల దగ్గరకే వస్తారని, అలాంటి న్యాయ వృత్తిలోకి అడుగుపెట్టబోయే విద్యార్థులంతా నిత్య అధ్యయనం చేస్తూ ధైర్యంగా ముందడుగు వేయాలన్నారు.
బంగారు పతకాల పంట
కార్యక్రమంలో 409 మంది విద్యార్థులకు వివిధ న్యాయ శాస్త్ర పట్టాలను ప్రదానం చేశారు. 49 బంగారు పతకాలను ప్రదానం చేయగా ఎల్ఎల్బీ విద్యార్థిని తన్వీ తహిన 11.. కరణ్ గుప్తా, శుభ్రా త్రిపాఠి 6 చొప్పున అందుకున్నారు.
దేశంలో 5వ స్థానంలో నల్సార్
దేశంలోని నాలుగు వందల వర్సిటీల్లో నల్సార్కు 5వ స్థానం లభించిందని నల్సార్ వైస్ చాన్స్లర్ పైజన్ ముస్తఫా చెప్పారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసేటపుడు నల్సార్ తమ వంతు సహకారం అందిస్తోందని, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై భారత ఎన్నికల సంఘంతో ఎంవోయూ కుదుర్చుకున్నామని వెల్లడించారు. నల్సార్ వర్సిటీ చాన్స్లర్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రముఖ న్యాయ కోవిదుడు ప్రొఫెసర్ ఉపేంద్ర భక్షికి కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. భక్షి మాట్లాడుతూ.. జీవించే హక్కు గురించి రాజ్యాంగంలో చిన్నగా ఉన్నా కోర్టులు విశాల భావజాలంతో తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. పర్యావరణ హితంగా సాగిన జీవనం.. ఇప్పుడు మనిషి మాత్రమే ముఖ్యమనే ధోరణిలో సాగుతోందని, రానున్న కాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో పర్యావరణం ఒకటని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రి, జస్టిస్ పి.వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆనాడే తుపాకీ పట్టేవాడిని
Published Sun, Jul 29 2018 2:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement