అమీర్పేట: కరోనా లేని రాష్ట్రంగా తెలంగాణను చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శనివారం సనత్నగర్ ఈఎస్ ఐ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్లాస్మా బ్యాంకును ఆమె ప్రారంభించి, తొలి ప్లాస్మా దాత సంతోష్గౌడ్ను అభినందించారు. అనంతరం వార్డులో తిరిగి వైద్యసేవలపై వాకబు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కరోనా చికిత్స విధానంలో ప్లాస్మా థెరపీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వైరస్ నుండి కోలుకున్న వారు తమ ప్లాస్మా ను ఇతర రోగులకు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి భయం అవసరం లేదని పేర్కొన్నారు. వైరస్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న సేవలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా రూపొందించిన అత్యాధునిక పీఏపీఆర్ కిట్ను ఆసుపత్రిలో ప్రదర్శించారు. వైద్య కళాశాల డీన్తో పాటు ఈఎస్ఐసీ రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు.
ఈఎస్ఐలో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన గవర్నర్
Published Sun, Jul 19 2020 5:12 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Delhi liquor scam: కేజ్రీవాల్కు ‘ప్రచార’ బెయిల్
మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
తప్పక చదవండి
- కదిలించిన కడప చైతన్యం
- దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
- ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
- Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
- పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
- తనిఖీలు చేయండి.. నిఘా పెంచండి
- అబద్ధాల మోదీ
- Aravind Kejriwal: నేను వచ్చేశా...
- బీజేపీ వైపే ప్రజలు
Advertisement