సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్లను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. దీంతో నగరంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రత్యూష్సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుల తుది జాబితా శుక్రవారం విడుదలైంది.
గ్రేటర్లో ముఖ్య విభాగాల బాధ్యతలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, స్పెషల్ కమిషన ర్లు అహ్మద్బాబు, ప్రద్యుమ్న, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్కుమార్ మీనాలను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో ఆయా స్థానాల్లో కొత్త అధికారులు రానున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్కుమార్ ప్రసాద్ను అక్కడి నుంచి ఇప్పటికే బదిలీ చేయడంతో ఆ స్థానానికీ కొత్త అధికారి రానున్నారు.
గత జాబితాలోనే వీరిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించి నప్పటికీ, తుది జాబితాలో మార్పుచేర్పులకు అవకాశముంటుం దనే అభిప్రాయాలు వెలువడ్డాయి. మెట్రోపొలిస్ సదస్సు ముగింపు రోజే తుది జాబితా వెలువడటం యాధృచ్ఛికమే అయినా, జీహెచ్ఎంసీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. తుదిజాబితాలో సోమేశ్కుమార్ను తెలంగాణకే కేటాయిస్తారని.. కాదు ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తారని పందేలు కూడా జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు.. సమగ్ర కుటుంబ సర్వే.. బతుకమ్మ ఉత్సవాలు.. మెట్రోపొలిస్ వంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సోమేశ్కుమార్ ముఖ్యభూమిక పోషించారు.
మెట్రోపొలిస్ నిర్వహణలో, విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంలో అహ్మద్బాబు ఎంతోకృషి చేశారు. పనితీరుతోనే కాక, వ్యవహార తీరుతోనూ సోమేశ్కుమార్ వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. పలువురికి కంటగింపుగామారినప్పటికీ తనదైన శైలిలో ముందుకు సాగారు. గత ఏడాది అక్టోబర్ 23న సోమేశ్కుమార్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకున్నప్పటికీ తొలిజాబితాలో ఆయనను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు.
తుది జాబితాలో మార్పులు జరగవచ్చుననే అభిప్రాయాలు వెలువడ్డాయి. స్పెషల్ కమిషనర్లు అహ్మద్బాబు, ప్రద్యుమ్నలు కొద్దినెలల కిందటే జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చారు. వీరిస్థానంలోనూ కొత్త అధికారులు రానున్నారు. తొలిజాబితాలో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపు జరిగిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్కుమార్ మీనా సైతం తుదిజాబితాలోనూ అక్కడకే వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రాబోయే అధికారుల కనుగుణంగా ఆయా విభాగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
‘గ్రేటర్’ మార్పులు
Published Sat, Oct 11 2014 4:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement