► మూడు నెలలుగా ఎవరికీ చెప్పుకోలేదు
► శ్రుతిమించడంతోనే ఫిర్యాదు చేశా
► సీఐడీ సీఐ బాధిత మహిళ
► విచారణ ముమ్మరం చేసిన పోలీసులు
కరీంనగర్ క్రైం : విచారణ పేరుతో సీఐడీ సీఐ తనను అసభ్యకరంగా వేధించాడని, మూడు నెలలు ఎవరికీ చెప్పుకోలేక మధనపడ్డాడని, ఇటీవల వేధింపుల శ్రుతిమించడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె కథనం ప్రకారం.. కరీంనగర్లోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. ఈ క్రమంలో అక్రమ ఫైనాన్స కేసులో అరెస్ అయిన ఏఎస్సై మోహన్రెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా అతడి బంధువులను సీఐడీ అధికారులు కరీంనగర్ హెడ్క్వార్టర్స్కు పిలిపించి విచారణ చేశారు.
బాధిత మహిళ కూడా మోహన్రెడ్డి బంధువు కావడంతో ఆమెను కూడా విచారణకు పిలిపించారు. విచారణ బృందంలో సభ్యుడిగా ఉన్న సీఐడీ సీఐ దయాకర్రెడ్డి మహిళ ఫొన్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత నుంచి తరచూ ఫోన్లు చేస్తూ పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఎదైనా అంటే విచారణలో భాగమే అంటూ ఇబ్బంది పెట్టేవాడు. కొద్ది రోజుల తర్వాత రోజుకు వందలాది కాల్స్ చేయడం, వాట్సప్ మెసేజ్లు పంపడం మొదలు పెట్టాడు. మూడు నెలలుగా నిరంతరంగా వచ్చి పడుతున్న మెసేజ్లతో మహిళ చాలా ఇబ్బంది పడింది. ఫోన్ చేయొద్దని, మెసేజ్లు పెట్టొద్దని కోరినా సీఐ మారలేదు. అసభ్యకరమైన బొమ్మలతో కూడిన మెసేజ్లు బయటకు చెప్పుకోలేని మెసేజ్లు పెట్టేవాడు. వారం రోజుల నుంచి సీఐ చేష్టలు శ్రుతిమించడంతో భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
విచారణ వేగవంతం
మహిళను వేధింపులకు గురిచేసిన నేపథ్యంలో హైదరాబాద్ కార్యాలయంలో పని చేస్తున్న సీఐడీ సీఐ దయాకర్రెడ్డిపై కరీంనగర్ టుటౌన్ పీఎస్లో నిర్భయ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కూడా వేగవంతం చేశారు. సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.దయాకర్రెడ్డికి చెందిన వాట్సప్ నంబర్లు, మరో ఫొన్ నంబర్కు చెందిన పలు వివరాలు, కాల్లిస్టు సేకరించారు. బాధిత మహిళకు సెల్ ద్వారా, వాట్సప్ నంబర్ ద్వారా పంపించిన మెసేజ్లకు సంబంధించిన డేటా సేకరించారు. ఈ కేసును విచారణ చేసేందుకు టూటౌన్ సీఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం రెండు రోజుల్లో హైదరాబాద్కు వెళ్లనున్నట్లు తెలిసింది. సీఐడీ విభాగంలో సీఐగా పని చేస్తూ విచారణకు వచ్చిన మహిళను వేధించడంపై మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
విచారణ పేరుతో వేధించాడు
Published Mon, Apr 4 2016 4:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement