♦ మిడ్ మానేరు కాలువలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి
♦ ఆర్అండ్ఆర్పై సమీక్షలో కలెక్టర్లకు మంత్రి హరీశ్రావు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు కాలువల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులకు ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో ప్రాజెక్టులో 10 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయనున్నామని, ఈ దృష్ట్యా పెండింగ్లో ఉన్న భూసేకరణ, సహాయ, పునరావాస (ఆర్అండ్ఆర్) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యం చేయరాదని, పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. మిడ్మానేరు. కాళేశ్వరం, తుపాకులగూడెం ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై మంత్రి హరీశ్రావు బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మిడ్ మానేరు ప్రాజెక్టు ప్యాకేజీ–8 లో పెండింగ్లో ఉన్న 200 ఎకరాల భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని కోరారు. కాల్వలను స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అన్నారు. మిడ్ మానేరు కింద 80 వేల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, కాలువలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయకుంటే లక్ష్యం నెరవేరదని మంత్రి అభిప్రాయపడ్డారు. మిడ్ మానేరు ముంపు బాధితుల ఆర్అండ్ఆర్ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
కాగా, మిడ్ మానేరు కింద ముంపునకు గురవుతున్న గ్రామాల్లో కొన్ని చోట్ల ప్రజలు ఇంకా ఖాళీ చేయలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముంపునకు గురయ్యే చింతల్ ఠాణా, కోదురుపాక, శాబాసుపల్లి, కొడి ముంజ, చీర్లవంచ, అనుపురం, ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, వరదవెల్లి గ్రామాల నిర్వాసి తులకు ఇంకా పెండింగ్లో ఉన్న చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ముంపు గ్రామాల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లే వారికి రూ.2 లక్షల పరిహారం వెంటనే అందజేయాలని కోరారు.
ఆర్అండ్ఆర్ కాలనీల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే గ్రామాలలో విద్యుత్ లైన్లు తొలగించాలని చెప్పారు. అలాగే కాళేశ్వరం, తుపాకులగూడెం ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను కూడా వేగిరం చేయాలని సూచించారు. సమీక్షలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషి, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి వికాస్రాజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్, ఈఎన్సీ మురళీధరరావు పాల్గొన్నారు.
పరిహారం చెల్లింపులో జాప్యం వద్దు
Published Thu, Jul 20 2017 1:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement