ఏమ్మా... గిరాకీలు ఎట్లా ఉన్నయ్‌ ? | Sakshi
Sakshi News home page

ఏమ్మా... గిరాకీలు ఎట్లా ఉన్నయ్‌ ?

Published Mon, Oct 22 2018 2:04 AM

Harish rao visit Vegetable market - Sakshi

గజ్వేల్‌: ఏమ్మా... బాగున్నారా.. గిరాకీలు ఎట్లా ఉన్నయ్‌? సౌలత్‌లకు ఇబ్బంది లేదు కదా? అంటూ మహిళా కూరగాయ రైతులను  మంత్రి హరీశ్‌రావు ఆత్మీయంగా పలకరించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌–పాతూరు కూరగాయల మార్కెట్‌ను ఆయన సందర్శించారు.

మహిళా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ మార్కెట్‌తో మంచి ఫలితాలు రావడం ఆనందంగా ఉందన్నారు. మహిళా రైతులు మంత్రితో మాట్లాడుతూ.. సార్‌ మీరు రాక చాలా రోజులవుతుందంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూరగాయలు కొనడానికి వచ్చిన వారిని కూడా మంత్రి పలకరించారు. దీంతో హరీశ్‌తో పలువురు వినియోగదారులు సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.

Advertisement
Advertisement