ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న పుష్కర రద్దీ | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న పుష్కర రద్దీ

Published Thu, Jul 23 2015 11:49 AM

heavy rush in adilabad pushkara ghats

జన్నారం(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి పుష్కరఘాట్‌లలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిర్మల్ మండలం సోన్ వద్ద ఉదయం 11 గంటలకల్లా నలబై వేల మంది స్నానాలు చేశారని యంత్రాంగం అంచనా వేసింది. జన్నారం మండలం బాదంపల్లి సమీపంలోని గోదావరి పుష్కర ఘాట్‌లో కూడా రద్దీ నెలకొంది. తెలంగాణ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు.. అలాగే, మంచిర్యాల జూనియర్ సివిల్ జడ్జి ఉపేందర్‌రావు, భైంసా జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్‌రావు, బోథ్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.రవీందర్ పుష్కర స్నానాలు చేశారు.

Advertisement
Advertisement