యాదాద్రిలో భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో భక్తుల రద్దీ

Published Sat, Oct 24 2015 3:49 PM

Heavy rush in Yadadri

యాదగిరిగుట్ట (నల్లగొండ) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి ప్రస్తుతం 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు వాహనాలను గుట్టపైకి అనుమతించడం లేదు. దసరా సెలవులు ముగుస్తుండటంతో స్వామివారిని  దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.

Advertisement
Advertisement