ఆరోగ్య సమాచారం సేకరించి ఇస్తామన్న కేటీఆర్
హైదరాబాద్: 'రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం సేకరిస్తాం. దాన్ని డిజిటలైజ్డ్ హెల్త్కేర్ ద్వారా భద్రపరుస్తాం. ఆధార్ తరహాలో ఆ వివరాలను తెలుపుతూ హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది' అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. నానక్రాంగూడ హయత్ హోటల్లో 'సెంటర్ ఫర్ హెల్త్కేర్ ఎంటర్ప్రెన్యూర్షిప్'ను గురువారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ... 'రాష్ట్రంలోని 3.6కోట్ల మంది ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి భద్రపరుస్తాం. ప్రతి ఒక్కరికీ యూనిక్ నంబర్ ఇవ్వడం వల్ల వారి ఆరోగ్య సమస్య లు, బ్లడ్ గ్రూప్ తదితర వివరాలు అవసరమైనప్పుడు ఒక్క క్లిక్లో తెలుసుకొనే వీలుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ డిజిటలైజేషన్ చేసి, రాజధాని ద్వారా అందరితో మాట్లాడి తగిన చర్యలు తీసుకొనేలా మార్పులు చేస్తున్నాం. రాష్ట్ర జనాభాలో 30 శాతం పట్టణాల్లో, ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులల్లో డాక్టర్లు, స్పెషలిస్ట్లను నియమించేందుకు తగిన చర్యలు తీసుకొంటాం' అన్నారు.
ఐటీ, ఏరోస్పేస్, హెల్త్కేర్కు ప్రాధాన్యం: 'రాష్ట్ర ప్రభుత్వం మూడు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. అందులో మొదటిది ఐటీ రంగం. తరువాత ఏరో స్పేస్ సెంటర్, హెల్త్కేర్. ఇప్పటికే ఐటీ విస్తరణ సాగింది. ఏరో స్పేస్ హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఆరోగ్య పరిరక్షణపై కూడా పూర్తి స్థాయి దృష్టి సారించాం' అని కేటీఆర్ చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఇండియన్ రివర్స్ అడ్వైజరీ కార్పొరేషన్ ఎండీ అవినాశ్, ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ దేశాయ్, ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ నారాయణన్ పాల్గొన్నారు.
ఆధార్లా ప్రతి పౌరుడికీ హెల్త్ కార్డు
Published Fri, Dec 4 2015 2:09 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
No Headline
No Headline
శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ‘గంగుల’
కరీంనగర్లో ‘లండన్’ ఎగ్జిబిషన్
నేలకు సారం.. పంటకు ప్రాణం
పనులు సత్వరమే పూర్తి చేయాలి
బీమా చెక్కు అందజేత
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement