♦ మధుకర్ కేసులో పోలీసులకు ఉమ్మడి హైకోర్టు ఆదేశం
♦ మధుకర్ది హత్యేనంటూ హైకోర్టులో అతడి తల్లి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన మధుకర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేప థ్యంలో అతడి మృతదేహానికి మరోసారి శవ పరీక్ష (రీపోస్టుమార్టం) నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల నేతృత్వంలో రీ పోస్టుమార్టం జరపాలని స్పష్టం చేసింది. కరీంనగర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమ క్షంలో ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలంది.
రీ పోస్టుమార్టం వేళ మధుకర్ కుటుంబ సభ్యులను అనుమతించడంతోపాటు మొత్తం ప్రక్రియను వీడియో తీయా లని పోలీసులకు స్పష్టం చేసింది. అనంతరం దీనిపై ఓ నివే దికను సీల్డ్ కవర్లో తమ ముం దుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను వచ్చే వారానికి వాయిదా వేసింది. గురు వారం ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రామలిం గేశ్వరరావు ఉత్తర్వు లు జారీ చేశారు.
ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ
తన కుమారుడి మృతి కేసును హత్య కేసుగా పరిగణించి ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతూ మధుకర్ తల్లి లక్ష్మి హైకోర్టులో గురువారం లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపించారు. మార్చి 13న ఇంటి నుంచి వెళ్లిన మధుకర్ 14వ తేదీన శవమై కనిపించాడని, దీన్ని పోలీసులు అనుమానస్పద మృతిగా పరిగణించారని, ఇది సరికాదని ముమ్మాటీకి హత్యేనని వివ రించారు.
అగ్ర కులానికి చెందిన అమ్మా యిని ప్రేమించినందుకు సదరు యువతి బంధువులు మధుకర్ను హత్య చేశారని తెలి పారు. మధుకర్ మృతికి కారణమైన వారిపై పిటిషనర్ అనుమానం వ్యక్తం చేసినా పోలీ సులు కనీసం ప్రశ్నించలేదని, ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తుపై తమకు అనుమానాలు న్నాయన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావా లంటే మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణుల చేత రీపోస్టుమార్టం చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ నిపుణులున్నారని వివరించారు.
రీ పోస్టుమార్టంపై ఇప్పటికే నిర్ణయం..
ప్రభుత్వ న్యాయవాది (హోం) హెచ్.వేణు గోపాల్ స్పందిస్తూ, రీ పోస్టుమార్టంపై ఇప్ప టికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాకతీయ వైద్య కళాశాల వైద్యులు రీ పోస్టు మార్టం చేయనున్నారని కోర్టుకు నివేదిం చారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉస్మా నియా, కాకతీయ వైద్య కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహిం చాలని పోలీసులను ఆదేశించారు. మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని, మధుకర్ కుటుంబ సభ్యులను అనుమతించాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
రీ పోస్టుమార్టం చేయండి
Published Fri, Apr 7 2017 2:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అడవిమామిడిపల్లిలో అగ్నిప్రమాదం
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్తో
మంటలు అంటుకొని రైతు మృతి
బాధిత జర్నలిస్టుకు ఆర్థికసాయం
కడియం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement