సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–1998 నియామకాల్లో జరిగిన అక్రమాల్ని తొలగించి మెరిట్ జాబితా ప్రకటించాలన్న హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయడానికి రికార్డులు అందుబాటులో లేవని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009లో జారీ చేసిన ఆదేశాల్ని కావాలనే అమలు చేయడం లేదని, ఇదే తీరు కొనసాగిస్తే బాధ్యులైన అధికారులను జైళ్లకు పంపాల్సివస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు హెచ్చరించారు. కోర్టు ఆదేశాలు అమలు కాలేదని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి.
ఈ సందర్భంగా డీఎస్సీ– 1998 రికార్డులు లేనందున హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేకపోతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్రావు చెప్పారు. దీనిపై న్యాయమూర్తి మండిపడ్డారు. ‘కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.
రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు మెరిట్ జాబితాను ప్రభుత్వమే అందజేసింది. రికార్డులు లేకపోతే సుప్రీంకోర్టుకు ఎలా ఇచ్చారు? కావాలనే కాలయాపన చేస్తున్నారు. మెరిట్ జాబితాలో అక్రమాల్ని సవరిస్తామని ప్రభుత్వమే చెప్పి పిటిషనర్లయిన నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేసింది. ఇప్పుడు దాన్ని పట్టించుకోరా?..’అంటూ న్యాయమూర్తి నిలదీశారు. కోర్టు ఆదేశాల్ని అమలు చేసే అవకాశమే లేదని సంజీవ్కుమార్ చెప్పగానే.. న్యాయమూర్తి కల్పించుకుని అదే జరిగితే బాధ్యులైన అధికారులను జైళ్లకు పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. పూర్తి వివరాల్ని అందజేసేందుకు విచారణను 27వ తేదీకి వాయిదా వేశారు.
ఆ విచారణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్వయంగా హాజరుకావాలని, ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రికార్డుల్లేవంటే.. అధికారులకు జైలే!
Published Tue, Jul 24 2018 2:20 AM
Related news
-
నాడు–నేడుకు దేశం ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ అంశం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. నాడు–నేడు ద్వారా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడాన్ని ఉత్తరాది రాష్ట్రాలు కొనియాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల పరిస్థితులు, ప్రస్తుతం సీఎం జగన్ హయాంలో పాఠశాలల స్థితిగతులపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కళ్లకు కట్టినట్లు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నాడు–నేడు షార్ట్ వీడియోలు ట్రెండీగా మారాయి. ఏపీలోని నాడు–నేడుపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ► రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విద్యాసంస్థలను పట్టించుకోలేదు. ► విద్య, మధ్యాహ్న భోజన విషయంలో సైతం సర్కారీ బడులపై బాబు చిన్నచూపు చూశారు. ► 2014–19 మధ్య దాదాపు 1,785 పాఠశాలలను మూసివేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.► 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీ సీట్లతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ► 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో..సీఎం జగన్ అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.సోషల్ మీడియాలో పలువురి కామెంట్లు ఇలా..► ఇది కేవలం విజనరీ సీఎం జగన్ వల్లే సాధ్యం► నాకు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అంటే ఇష్టం.. మంచి విద్య, అద్భుతమైన ఆట స్థలాలు ► అవును ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు అవసరమే► దేశంలో ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని స్ఫూర్తిగా తీసుకోవాలి► ఏపీ సీఎం జగన్ కింగ్ ట్రెండింగ్లో కావ్య వీడియోసీఎం జగన్ విద్యా వ్యవస్థలో నాడు–నేడు ద్వారా తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులను గుర్తిస్తూ ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ‘కావ్య’ ఓ వీడియోను రూపొందించారు. ►విద్యా వ్యవస్థలో దేశంలోనే ఏపీ సరికొత్త అడుగులు వేసిందని, గతంలో ఉన్న అధ్వాన పరిస్థితిని సమూలంగా మార్చివేసిందంటూ ప్రశంసలు కురిపించారు. ►అత్యాధునిక ఫర్నిచర్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేశారని.. ఆ రోజుల్లో మనకు ఇటువంటి సౌకర్యాలు లేవే అంటూ.. సీఎం జగన్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, ఐబీ సిలబస్ను పరిచయం చేయడం అభినందనీయమని, ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని, బడుగు, బలహీన వర్గాల వారికి చదువుపై ఆసక్తి పెరిగిందంటూ వీడియో చేశారు. ►ఆ వీడియోను యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేయడంతో పదిలక్షలకు పైగా నెటిజన్లు వీడియో చూసి, వేల సంఖ్యలో షేర్ చేస్తూ ‘సూపర్ ఏపీ స్కూల్స్’ అంటూ కితాబు ఇస్తున్నారు. ►మరికొంత మంది నాడు–నేడుపై షార్ట్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఉత్తరాది జనం ఫిదా అవుతున్నారు. ►యూపీ, హరియాణా, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా విద్య ఉంటే బాగుంటుందంటూ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ►దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఇదే తరహా నాణ్యమైన విద్య దేశం మొత్తం తీసుకురావాలని, సీఎం జగన్ను కొనియాడుతూ లైకులు, కామెంట్లు, షేర్ చేస్తున్నారు. -
అంకుశమై నిలుస్తాం! : కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రజల పక్షాన ఆయుధమై కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతామని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రజలకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచాలన్నా.. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కారి్మకులు, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరగాలన్నా.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చా రు. అప్పుడే ప్రభుత్వం దిగొస్తుందని.. హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చేవెళ్లలో నిర్వహించిన తొలి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అంబేడ్కర్, జ్యోతిబా పూలే స్ఫూర్తితో పదిహేనేళ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆ మహానుభావులకు బీఆర్ఎస్ సముచిత స్థానం కల్పించింది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా సచివాలయానికి ఆయన పేరు పెట్టాం. సచివాలయం ముందు ధర్నాకు దిగుతా.. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. ప్రజానీకానికి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం, గౌరవం ఉండాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు సాధ్యంకాని హామీలిచ్చింది. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తోంది. కానీ గత ప్రభుత్వం సృష్టించిన వనరులను వాడుకునే నైపుణ్యం వారికి లేకుండా పోయింది. మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి. మంచినీరు దొరకడం లేదు. సాగునీరు అందడం లేదు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు నిలిచిపోయాయి. దళితవాడలు ధనిక వాడలు కావాలనే సదుద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ రూ.12 లక్షల చొప్పున ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అది ఇవ్వకపోగా.. 1.36 లక్షల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ను రద్దు చేసింది. కలెక్టర్ల అకౌంట్లలో జమ చేసిన నగదును వాపస్ తీసుకుంది. అర్హులైన దళితులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి. లేదంటే 1.36 లక్షల మంది లబ్ధిదారులతో కలసి సచివాలయం ముందు ధర్నాకు దిగుతా. మార్కెట్లో తులం బంగారం దొరకడం లేదా? మౌనంగా ఉంటే సమస్యలు తీరవు. ఎన్నికల ప్రచారం కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను దళితబంధుపై నిలదీయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం ఆర్థిక సాయం చేసే కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. కాంగ్రెస్ దానికి అదనంగా తులం బంగారం చొప్పున ఇస్తామని మాయమాటలు చెప్పింది. ఏమైంది? ఆడబిడ్డలకు ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కారుకు మార్కెట్లో తులం బంగారం దొరకడంలేదా? కేసీఆర్ వెళ్లగానే కరెంటు పోతుందా? తెలంగాణలో 11 ఏళ్ల క్రితం దారుణ పరిస్థితి ఉండేది. మేం ఏడాదిన్నర వ్యవధిలో బాగుచేశాం. రైతులు, పరిశ్రమలు, గృహాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేశాం. కేసీఆర్ వెళ్లగానే కరెంటు ఎందుకు రావట్లేదు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా? మిషన్ భగీరథ పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అభినందించింది. మరి ఎవరి తెలివి తక్కువతనం వల్ల మంచి నీటి కొరత ఏర్పడింది? ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. వరికి బోనస్ ఇవ్వకుంటే ఊరుకోబోం.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 వాగ్దానాలు ఇచ్చింది. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. స్కూటీలు ఇవ్వకపోగా.. రాష్ట్రంలో లూటీలు మొదలుపెట్టింది. రియల్ ఎస్టేట్ను దెబ్బతీసింది. అనుమతులు నిలిపివేసింది. ఆ రంగంపై ఆధారపడి బతుకుతున్నవారిని రోడ్డు పాలు చేసింది. ప్రభుత్వం యాసంగి పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి. వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే.. లేదంటే ఊరుకోబోం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి ఇదేనా? కేంద్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంది. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టడం, మత పిచ్చి పెంచడం తప్ప చేసిందేమీ లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేసింది. మోదీ, ఈడీ.. ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి? గుడ్డిగా ఓటేయొద్దు. బీజేపీ సర్కారు దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరుతూ నేను వంద ఉత్తరాలు రాసిన.. కానీ ఒక్క కాలేజీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ నా మెడపై కత్తిపెట్టాడు. కానీ నేను మీటర్లు పెట్టలేదు. దాంతో ఏటా రూ.5 వేల కోట్లు కోత కోసిండు. తెలంగాణకు రూ.30 వేల కోట్ల నష్టం వచ్చింది. బీజేపీకి నూకలు తినిపించాలి వికారాబాద్, చేవెళ్లలో ధాన్యం బాగా పండింది. పండిన ధాన్యాన్ని కొనుమంటే.. యాసంగి ధాన్యం నూకలు అయితయి. తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయండి అని కేంద్ర మంత్రి ఒకరు ఉచిత సలహా ఇచ్చిండు. నూకలు తిందామా? బీజేపీకి నూకలు తినిపిద్దామా? తెలంగాణ ఇచ్చినప్పుడు 7 మండలాలను, సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాలో కలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఏ వర్గానికీ మేలు జరగలేదు. మేం పదేళ్లలో చేవెళ్లను పారిశ్రామిక కేంద్రంగా, రియల్ ఎస్టేట్ జోన్గా అభివృద్ధి చేశాం. రంజిత్రెడ్డి ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా? ఎంపీ రంజిత్రెడ్డికి ఏం ఏం తక్కువ చేశాం? ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? రంజిత్రెడ్డి ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే అటు తిరుగుతడా? ఆయన పార్టీ ఎందుకు మారాడు.. అధికారం కోసమా? పైరవీల కోసమా. రంజిత్కు పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరినట్టు బీసీ అయిన కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకోవాలి. కాసాని గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాం«దీ, కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎగ్గె మల్లేశం, దయానంద్గుప్తా తదితరులు పాల్గొన్నారు. బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం తెలంగాణలో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అంకుశం లాంటి ఆయుధాన్ని బీఆర్ఎస్ చేతికి ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వ మెడలు వంచగలుగుతాం. బీఆర్ఎస్ గెలవాలి.. అంకుశంలా పనిచేయాలి. లేదంటే మోసం చేసిన వాళ్ల చేతిలోనే మళ్లీ మోసపోతాం. బీఆర్ఎస్ పుట్టిందే అణగారిన వర్గాల కోసం. అనేక మందిని కాపాడుకున్నాం. కేసీఆర్ బతికున్నంత కాలం పోరాటం చేస్తూనే ఉంటడు. -
మన చదువుకు కీర్తి కిరీటం!
అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులీనుతున్న వైనాన్ని వరసగా మూడో ఏడాది కూడా క్యూఎస్ (క్వాక్వరెలీ సైమండ్స్) జాబితా నిరూపించింది. బుధవారం ప్రకటించిన ఆ జాబి తాలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో 20వ ర్యాంకు సాధించి తనకెవరూ సాటిలేరని నిరూపించింది. వామపక్ష భావజాలం బలంగావున్న విద్యాసంస్థగా ముద్ర వున్న జేఎన్యూ ప్రతియేటా విద్యాప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తోంది. ఇక అహ్మదాబాద్ ఐఐఎం 25వ ర్యాంకు, బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలోనూ వున్నాయి. డేటా సైన్స్లో, పెట్రోలియం ఇంజనీరింగ్లో గువాహటి ఐఐటీ క్యూఎస్ జాబితాలో చోటు సంపాదించుకుంది. పరిశోధనా రంగంలో మన దేశం నాలుగో స్థానంలో వుండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనం బ్రిటన్ను అధిగమించటం గమనించదగ్గది. ఒకప్పుడు మన పరిశోధనలకు పెద్ద విలువుండేది కాదు. రెండేళ్లుగా ఈ ధోరణి మారడం మంచి పరిణామం. క్యూఎస్ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైనది. 96 దేశాల్లోని 1,559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలావున్నవో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు క్యూఎస్ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యాసంస్థలు వాటిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్య క్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలావున్నదో అంతర్జాతీయంగా భిన్నరంగాల్లో నిష్ణాతులైనవారి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ఫలానా యూనివర్సిటీనుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలూ, సామర్థ్యమూ ఎలావున్నాయో వివిధ కంపెనీలనూ, సంస్థలనూ అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరా తీస్తారు. అధ్యాపకుల ప్రమాణాలతోపాటు అధ్యాపకవర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యంవున్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారన్నది లెక్కేస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభావ్యుత్పత్తులు సాటిలేనివన్న ఖ్యాతి వుండేది. ఐటీరంగంలో మనవాళ్ల బుద్ధికుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖ లాలు కనబడుతూనే వున్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్ల విషయంలో మన విశ్వవిద్యాల యాలు వెనకబడివుండేవి. ఆ కొలమానాలు, అందుకనుసరించే పద్ధతులు సక్రమంగా వుండవనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవటం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా వుండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మన గడప తొక్కాలంటే అది తప్పనిసరి. వివిధ దేశాల్లోని విద్యాసంస్థలందించే విద్య ఎలావున్నదో తులనాత్మక అధ్యయనం చేయటంవల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో వున్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకెళ్లే విద్యార్థులకు మాత్రమే కాదు... పరిశోధకులకూ ప్రయోజనకారిగా వుంటుంది. అలాగే అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. అయితే సంపన్న, వర్ధమాన దేశాల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ పెట్టడం ఎంత మాత్రమూ సరైంది కాదన్న వాదనలు ఎప్పటినుంచో వున్నాయి. పరిశోధనలకూ లేదా పరికల్పనలకూ సంపన్న దేశాల్లో ప్రభుత్వాలనుంచీ, ప్రైవేటు వ్యక్తులనుంచీ నిధుల రూపంలో అందే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ అది చాలా అరుదు. మన విశ్వవిద్యాలయాలు వెనకబడి వుండటానికి అదొక కారణం. ఇక ఇతర విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకోవాలి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని తొలి యూపీఏ ఏలుబడిలో 2005లో దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ–గాట్స్ సంభాషణల్లో సూత్రప్రాయంగా అంగీకరించిన పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు విద్య కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విదేశీ వర్సిటీలకు మన దేశం తలుపులు తెరిచింది. 2017లో నైరోబీలో జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో ఎన్డీఏ సర్కారు సంతకం చేశాక 62 ఉన్నత విద్యాసంస్థలకు ‘ఆర్థిక స్వయంప్రతిపత్తి’ మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించటమే. పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవటం నిరుపేద వర్గాలకు కష్టమవుతోంది. దానికితోడు అధ్యాపక నియామకాల్లోనూ, మౌలిక సదుపాయాలు కల్పించటంలోనూ ప్రభుత్వాలనుంచి మద్దతు కొరవడుతోంది. ఏతావాతా చాలా విశ్వవిద్యాలయాలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. ఇప్పుడు ఉన్నత శ్రేణి ర్యాంకులు పొందిన విద్యాసంస్థలకు దీటుగా ఇతర సంస్థలను కూడా తీర్చిదిద్దకపోతే, అన్ని వర్గాలకూ అందుబాటులోకి రాకపోతే ‘స్కిల్ ఇండియా’ వంటివి నినాదప్రాయమవుతాయని పాలకులు గుర్తించాలి. ఉన్నత విద్యను అందుకోవాలనుకునే పేద వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ విధానం కింద దేశంలోనే కాదు... అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల్లో సీటు సంపాదించుకునేవారికి సైతం భారీ మొత్తాల్లో ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతోంది. వారు చదువుకునే కాలంలో అయ్యే వ్యక్తిగత ఖర్చు కూడా భరిస్తోంది. ఈ మాదిరి విధానం ఇతర రాష్ట్రాల్లో లేదు. క్యూఎస్ ర్యాంకుల జాబితా ఇలాంటి అంశాలపై పాలకులు దృష్టి సారించేలా చేయగలిగితే, లోపాలను సరిదిద్దగలిగితే అది మన విద్యా, వైజ్ఞానిక రంగాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఈనెల 15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కిడ్నాప్ చేసి.. బెదిరించి -
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి.
Related News by category
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డీప్ఫేక్ వీడియో కేసులో మే 1న విచారణకు రావాలని ఆదేశించింది. తన వెంట గ్యాడ్జెట్స్ తీసుకురావాలని తెలిపింది.కాగా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసింది. దీనిపై బీజేపీ, హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్(IFSO) దర్యాప్తు చేస్తోంది.అయితే తెలంగాణ పీసీసీ అధికారిక ట్విటర్ హ్యాండీలో అమిత్ షా వీడియో పోస్టు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎంతోపాటు తెలంగాణ డీజీపీ, సీఎస్కు కూడా ఢిల్లీ నోటీసులు జారీ అయ్యాయి.కాగా దేవంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది -
కలిసుంటే కలదు సుఖం
పదేళ్లు కలిసి కాపురం చేసిన ఫతేనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నివాసం ఉండే శ్రీలత (పేరు మార్చాం), మురళి(పేరు మార్చాం) దంపతులు ఇటీవల కాపురంలో కలహాలు పెరగడంతో విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించారు. ముగ్గుaరు పిల్లల తర్వాత భర్త మద్యానికి బానిసై, మానసికంగా శారీరకంగా హింసిస్తుండడంతో శ్రీలత భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ధృడంగా నిశ్చయించుకుంది.దంపతులిద్దరికీ జీడిమెట్లలోని సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్) సెంటర్లో అధికారులు కౌన్సిలింగ్ చేశారు. పలు దఫాల్లో సర్థిచెప్పిన తర్వాత వారి మధ్య సయోధ్య కుదిరింది. మురళిలోనూ మార్పు వచ్చింది. వారిప్పుడు సంతోషంగా కలిసి ఉంటున్నారు. లక్డీకపూల్లోని నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉండే 43 ఏళ్ల ముంతాజ్ బేగం (పేరు మార్చాం) 2013 వరకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఉద్యోగం మానేశారు. 63 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ఖలీల్ (పేరు మార్చాం)ను రెండో వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ ముందు వరకు ముంతాజ్ను బాగానే చూసుకున్న ఖలీల్ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొద లు పెట్టాడు. తన బతుకుతెరువుకు సైతం డబ్బు ఇవ్వకపోవడంతో బషీర్బాగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నాంపల్లి సీడీఈడబ్ల్యూ సెంటర్లో దంపతులకు కౌన్సిలింగ్ చేయడంతో ఖలీల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉంటున్నారు. కొద్దిపాటి మనస్పర్థలు కాపురాలు కూల్చేస్తున్నాయి. ఇక మద్యం మహమ్మారి దంపతుల మధ్య గొడవలకు మరింత ఆజ్యం పోస్తోంది. దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడంతో అనుమానం పెనుభూతమవుతోంది. దీంతో వివాహబంధాన్ని తెంచుకోవాలన్న కఠిన నిర్ణయానికి వస్తున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు తొక్కుతూ ఏళ్లపాటు వ్యక్తిగత జీవితాలు బలిపెట్టుకుంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో బలమైన కారణం లేకుండానే వివాహ బంధాలను బలి చేసుకోకుండా, కొద్దిపాటి సర్దుబాట్లతో కాపురం తిరిగి కాపురాలు నిలబడేలా తెలంగాణ పోలీసులు ప్రయvస్తున్నారు. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్కు వచ్చే జంటలకు ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్శాఖలోని మహిళా భద్రత విభాగం అధికారులు సీడీఈడబ్ల్యూ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కలిపి మొత్తం 27 కౌన్సిలింగ్ సెంటర్లను నెలకొల్పారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటిల్లో గృహహింస కేసుల్లో బాధిత మహిళలు, వారి భర్తలు, అవసరం మేరకు ఇతర కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు. ఇలా పోలీసులను ఆశ్రయించిన జంటల్లో 42 శాతం మందిని తిరిగి కలిపినట్టు మహిళా భద్రత విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. మరో 29 శాతం మంది మాత్రం విడాకులు తీసుకునేందుకే నిశ్చయించుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి 27 కౌన్సిలింగ్ సెంటర్ల పరిధిలో ఏప్రిల్ 26 నాటికి మొత్తం 7,474 ఫిర్యాదులు నమోదైనట్టు వారు వెల్లడించారు. మొత్తం అందిన ఫిర్యాదుల్లో 853 మంది బాధితుల్లో ఆత్మహత్యలు చేసుకునే మానసిక స్థితి ఉండడంతో వారిని మానసిక నిపుణులైన కౌన్సిలర్ల వద్దకు పంపి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేలా కౌన్సిలింగ్ ఇప్పించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం అందిన 7,474 ఫిర్యాదుల్లో 6,600 కేసులలో పరిష్కారం లభించినట్టు తెలిపారు.ఏమిటీ సీడీఈడబ్ల్యూ సెంటర్లుగృహ హింస కేసుల్లో దంపతులు విడాకులు తీసుకోకుండా, సమస్యను గుర్తించి.. వారికి అర్థమయ్యేలా సర్దుబాటు చేసి తిరిగి కలిపేందుకు తెలంగాణ పోలీస్శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో సేఫ్ సిటీ ప్రాజెక్టు నిధులతో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మహిళా కౌన్సెలర్, మహిళా సిబ్బంది ఉంటారు. వీరు గృహహింసకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లకు వచ్చే జంటలకు, అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులకు పలు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
అసమానతలు తొలగేదాకా రిజర్వేషన్లు
బడంగ్పేట్: సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మొదటి నుంచీ రిజర్వేషన్లకు సంఘ్ అనుకూలంగా ఉందని వెల్లడించారు. తమ సంస్థ రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని... అందులో ఏమాత్రం వాస్తవం లేదని ప్రకటించారు. తాను ఓ సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోను ప్రచారం చేస్తున్నారని.. కానీ అసలు అలాంటి సమావేశం ఏదీ జరగలేదని వివరించారు. ప్రస్తుతమున్న సాంకేతికత, కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా జరగని దాన్ని కూడా జరిగినట్లు చూపించడం సాధమవుతోందని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్లో ఏర్పాటు చేసిన విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాల (సరస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థ)ను ఆదివారం ఆయన చినజీయర్ స్వామితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడారు. ప్రపంచాన్ని తెలుసుకొనే మార్గంగా విద్యను ఆయన అభివరి్ణంచారు. 1952లో సరస్వతీ శిశుమందిర్ చిన్న గదిలో ప్రారంభమైందని.. నేడు దేశవ్యాప్తంగా వేలాది పాఠ శాలలు నడుస్తున్నాయని చెప్పా రు. దేశభక్తి విలువలతో కూడిన విద్యకు తాము పెద్దపీట వేస్తున్నామన్నారు. మనమంతా రాముడి బాటలో నడవాలన్నారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని సూచించారు. స్వయం సేవక్లు చివరి శ్వాస దాకా సమాజం కోసం పనిచేస్తారని మోహన్ భాగవత్ తెలిపారు. మోదీ కృషి అభినందనీయం: చినజీయర్ దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని చినజియర్ స్వామి కొనియాడారు. భారత్ను విశ్వగురువుగా మార్చేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని.. కేవలం భారతీయుడిగా తన వాదన వినిపిస్తున్నానని చెప్పారు. విద్య అనేది పొట్టకూటి కోసం కాదని.. సక్రమమైన పౌరులుగా తయారయ్యేందుకేనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, క్షేత్ర ప్రచారక్ సు«దీర్, సహ ప్రచారక్ భరత్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సు«ధాకర్రెడ్డి, శ్రీనివాస్, రమే‹Ùగుప్తా, విష్ణువర్దన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిప్పులు కక్కుతున్న సూరీడు
సాక్షి, హైదరాబాద్: సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. భద్రాచలంలో గరిష్టంగా 43.8 డిగ్రీల సెల్సియస్, మెదక్లో 24.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీల సెల్సియస్కు మించి నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4.6 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 3.7 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రెండురోజులు పలుచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట్లకు ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రస్థాయిలో ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రణాళికా శాఖ ప్రకారం 45 డిగ్రీలపైనే.. ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలాచోట్ల ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో 45.4, ములుగు జిల్లా మంగపేటలో 45.3, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వాపురంలో 45.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
ఇంటర్సిటీల మధ్య వందే మెట్రోలు!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మార్గాల్లోనే!హైదరాబాద్ నుంచి నల్లగొండ మీదుగా గుంటూరు, సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కరీంనగర్, సికింద్రాబాద్–కర్నూలు, కాచిగూడ–కర్నూలు, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొదట ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–విజయవాడ వంటి రూట్లలో వందే మెట్రోలను ప్రవేశపెట్టొచ్చు. అనంతరం దశలవారీగా ఇతర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమైన స్టేషన్లలోనే హాల్టింగ్.. వందే మెట్రో రైళ్లు ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తున్న మెట్రో రైళ్ల తరహాలోనే ఉంటాయి. మొదట 12 కోచ్లతో ప్రారంభించి డిమాండ్కు అనుగుణంగా ఆ తరువాత 16 కోచ్ల వరకు పెంచనున్నారు. మెట్రో రైళ్ల తరహాలోనే పూర్తిగా ఏసీ సదుపాయం, ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకొని మూసుకొనే ఏర్పాటు ఉంటుంది. ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు ముఖ్యమైన స్టేషన్లలోనే ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం పుష్పుల్ రైళ్లకు ఉన్నట్లుగానే ముందు, వెనుక రెండు ఇంజన్లు ఉంటాయి. దీంతో ఈ రైళ్లను ప్రత్యేకంగా పిట్ లైన్లకు తరలించాల్సిన అవసరంలేదు. తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణ సేవలను అందించే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు ఉండవు... ఈ రైళ్లన్నీ సాధారణ రైళ్ల తరహాలోనే సేవలు అందిస్తాయి. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు కొనుక్కొని బయలుదేరొచ్చు. కూర్చొని ప్రయాణం చేసేందుకు వీలుగా సీట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే వీటిలో కొద్దిగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలనుకొనే వారికి ఈ రైళ్లలో ప్రయాణం లాభదాయకం. వివిధ మార్గాల్లో నడిచే ఇంటర్ సిటీ రైళ్ల స్థానంలోనే వందే మెట్రోలు రానున్నాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్సిటీ ట్రైన్ యథాతథంగా సేవలను కొనసాగించనుంది.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement