మరణంలోను వీడని బంధం | Sakshi
Sakshi News home page

మరణంలోను వీడని బంధం

Published Thu, Mar 12 2015 11:41 PM

husband and wife died in road mishap

వైరా (ఖమ్మం) : అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పలుకరించడానికి వెళ్లిన దంపతులు గురువారం వైరా పాత బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వైరాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కట్ల సంజీవరావు(55) సోదరుడు అనారోగ్యంతో ఉన్నారు. ఆయన్ని చూసేందుకు సంజీవ్‌రావు, భార్య పద్మావతి(45)తోకలిసి బైక్‌పై వెళుతున్నారు. పాత బస్టాండ్ సమీపంలోని టెలిఫోన్ ఎక్సేంజ్ సమీపంలో వెనుక నుండి అతి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొంది. దీంతో దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement