భార్యను పొడిచి..ఉరేసుకున్న భర్త | Sakshi
Sakshi News home page

భార్యను పొడిచి..ఉరేసుకున్న భర్త

Published Mon, Aug 31 2015 9:40 AM

Husband hanged himself after attacked on wife

పినపాక: కుటుంబకలహాల నేపథ్యంలోభార్యను కత్తితో పొడిచి తాను ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ ఘటన ఖమ్మం జిల్లా పినపాక మండలంలో ఆదివారం అర్థరాత్రి జరిగింది. మండలంలోని తోగ్గుట గ్రామానికి చెందిన అక్కిరెడ్డి వెంకట్‌రెడ్డి(70), పద్మ(50) భార్యభర్తలు. ఆదివారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో భార్యను వెంకట్‌రెడ్డి కత్తితో పొడిచాడు.

అదే సమయంలో అక్కడే ఉన్న కుమార్తె అడ్డురాగా ఆమెపై కూడా దాడి చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు పద్మను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వెంకట్‌రెడ్డి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Advertisement
Advertisement