దేశంలోనే తొలిసారిగా వాహన ఉల్లంఘనలపై నిఘాకు ప్రత్యేక వ్యవస్థ
- ఐటీఎంఎస్ ఏర్పాటు.. రాత్రీపగలూ నిరంతరాయంగా పరిశీలన
- పరిమితికి మించి వేగంగా వెళితే చిక్కినట్లే..
- రెడ్ సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్లో వచ్చినా అంతే..
- ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు మధ్య ఏర్పాటు
హైదరాబాద్: అర్ధరాత్రి సమయం.. ట్రాఫిక్ పోలీసులెవరూ ఉండరనే ఉద్దేశంతో అత్యంత వేగంగా వాహనం నడిపాడు ఓ యువకుడు.. కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకుపోయాడు.. కానీ ఒకటి రెండు రోజుల్లోనే అతడి ఇంటికి ఈ–చలానా వచ్చింది. పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లినందుకు, రెడ్ సిగ్నల్ జంప్ చేసినందుకు జరిమానా విధించారు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో అమల్లోకి వచ్చిన అత్యాధునిక సెన్సర్ కెమెరాల వ్యవస్థ పనితీరు ఇది.
పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం, రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా ముందుకెళ్లిపోవడం, రాంగ్ రూట్లో వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలన్నింటినీ రాత్రి సమయాల్లోనూ ఈ సెన్సర్ కెమెరాలు రికార్డు చేస్తాయి. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)గా పిలిచే ఈ వ్యవస్థను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని కేబీఆర్ పార్కు–జూబ్లీహిల్స్ చెక్పోస్టు మధ్య ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు.
ఎన్ని వాహనాలు వెళ్లినా..
హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ వి.రవీందర్ గురువారం ఈ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు 10,800 వాహనాలు వెళ్లినట్లుగా అందులో వెల్లడైంది. ఇక్కడ నిర్దేశించిన గరిష్ట వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లుకాగా.. 64 శాతం వాహనాలు పరిమితికి లోబడి వెళ్లాయని, మిగతావి ఎక్కువ వేగంతో వెళ్లాయని తేలింది. ఇక బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 వరకు 11,706 వాహనాలు వెళ్లగా... 2,200 వాహనాలు పరిమితికి మించిన వేగంతో వెళ్లినట్లు గుర్తించారు.
నాలుగు వాహనాలు 100 కి.మీపైన వేగంతో.. తొమ్మిది వాహనాలు 120 కి.మీపైగా వేగంతో దూసుకుపోయాయి. ఒక ఆడి కారు (ఏపీ 09 సీఏ 7119) గంటకు 127 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు ఐటీఎంఎస్లో నమోదైంది. మొత్తంగా సగానికిపైగా వాహనాలు నిర్దేశిత పరిమితికి మించి వేగంతో వెళ్లినట్లు తేలింది. స్మార్ట్ సిటీ, సేఫ్ సిటీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్వ్యాప్తంగా అన్ని కూడళ్లు, కారిడార్లలో పదివేల సెన్సర్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా రవీందర్ వెల్లడించారు.
ప్రయారిటీ ట్రాఫిక్ కూడా..
ట్రాఫిక్ ఎక్కువై ముందున్న వాహనాలు కదలకపోవడం, రెడ్ సిగ్నల్ పడి వాహనాలు ఆగిపోవడం వంటి వాటి కారణంగా చాలాసార్లు అంబులెన్స్లు ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంటాయి. అయితే ఐటీఎంఎస్లో ఏర్పాటు చేసే కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్కు అనుసంధానమై.. అంబులెన్స్లు వేగంగా ముందుకు కదిలేలా గ్రీన్సిగ్నల్స్ ఇస్తాయని అధికారులు చెబుతున్నారు.
24/7 నిఘా నేత్రం
Published Fri, Jul 7 2017 1:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement