ఐటీ దిక్సూచిగా హైదరాబాద్: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

ఐటీ దిక్సూచిగా హైదరాబాద్: కేటీఆర్

Published Sat, Jun 7 2014 2:31 AM

Hyderabad to be devolped as Compass for IT

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఐటీ రంగానికి హైదరాబాద్‌ను దిక్సూచిగా మారుస్తామని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆధునిక ధోరణులు, విప్లవాత్మక ఆలోచనలను, ఉత్పత్తులను ప్రపంచానికి అందించేందుకు హైదరాబాద్‌లో ‘ఐటీ ఇంక్యుబేటింగ్ ఫెసిలిటీ’ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని, విధివిధానాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఇండియన్‌స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)ను కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా  విలేకరులతో మాట్లాడుతూ.... ఐటీ ఇంక్యుబేటింగ్ కేంద్రం ఏర్పాటులో ఐఎస్‌బీ, ట్రిపుల్‌ఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తామని వివరించారు.

Advertisement
Advertisement