'ఎన్టీఆర్ తరువాత నేనే' | Sakshi
Sakshi News home page

'ఎన్టీఆర్ తరువాత నేనే'

Published Thu, Feb 12 2015 7:52 PM

చంద్రబాబు నాయుడు

హన్మకొండ: తెలంగాణ అభివృద్ధికి కృషి చేసింది ఎన్టీఆర్ తరువాత తానేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. హన్మకొండ బస్టాండ్ సమీపంలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన టీడీపీ సభలో ఆయన మాట్లాడారు. పార్టీ వీడింది నాయకులేనని, కార్యకర్తలు కాదని చెప్పారు. కార్యకర్తలను తాను ఎప్పుడూ మరచిపోలేదన్నారు. పార్టీకి అండగా నిలిచింది వారేనని చెప్పారు.  కార్యకర్తలకు తాను రుణపడి ఉన్నానన్నారు. ఇక్కడికి వచ్చింది రాజకీయాల కోసం కాదన్నారు.

అందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేస్తానని చెప్పారు. తెలంగాణలో విద్యుత్పై ఎక్కువ ఖర్చుపెట్టినట్లు తెలిపారు. బాబ్లీపై పోరాడింది టీడీపీయేనన్నారు. హైదరాబాద్లో భూ ఆక్రమణలను అడ్డుకున్నది తామేనని చెప్పారు. 50 లక్షల మంది సభ్యులను కూడగట్టుకున్న టీడీపీయేనన్నారు. నాయకులను తయారు చేసే సత్తా తమ పార్టీకే ఉందని చెప్పారు. తెలంగాణలో పేదరికం పోయినప్పుడే తెలంగాణ అమరవీరుల ఆత్మలకు శాంతి అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Advertisement
Advertisement