డెంగీతో ఐఐటీ విద్యార్థిని మృతి | Sakshi
Sakshi News home page

డెంగీతో ఐఐటీ విద్యార్థిని మృతి

Published Fri, Jun 5 2020 11:44 AM

IIT Student Deceased With Dengue Fever in Wanaparthy - Sakshi

వనపర్తి, అమరచింత: పట్టణానికి చెందిన దీక్షిత (18) ఐఐటీ విద్యార్థిని డెంగీ జ్వరంతో కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని చంద్రనాయక్‌ తండాకు చెందిన సీత్యానాయక్‌ కూతురు దీక్షిత ఐఐటీలో ఆల్‌ఇండియా 241వ ర్యాంకును సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి సీత్యానాయక్‌ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డారు. స్వగ్రామమైన చంద్రనాయక్‌ తండాకు విద్యార్థిని దీక్షిత మృతదేహంను తీసుకువచ్చి ఖననం చేశారు. (రానున్న రోజుల్లో పొంచి ఉన్న వ్యాధుల ముప్పు..)

Advertisement

తప్పక చదవండి

Advertisement