నిజామాబాద్ అఖిలపక్షాల జలసాధన యాత్రలో జానారెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజలను భయపెట్టి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనైతిక, నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి మండిపడ్డారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ పనుల యథాతథంగా కొనసాగించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జలసాధన యాత్ర పేరిట కామారెడ్డిలోని భూంపల్లి చెరువు నుంచి పద్మాజీవాడీ వరకు నిర్వహించిన పాదయాత్ర, అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘నాడు హోంమంత్రిగా ఉన్న నేను అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను చర్చలకు పిలిచాను.
కానీ, ఈ సీఎం ప్రజాసమస్యల కోసం వెళ్లిన కమ్యూనిస్టు నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇంత నియంతృత్వమా.. ఇది ఒక ప్రభుత్వమేనా? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ పేరిట రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్రెడ్డి, సారంపెల్లి మల్లారెడి(సీపీఎం), మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, గుండా మల్లేశ్, వేములపల్లి వెంకట్రామయ్య(న్యూడెమోక్రసీ), బీజేపీ, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
అఖిలపక్షం నోట.. వైఎస్ఆర్ మాట...
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం పాదయాత్ర, బహిరంగసభ సందర్బంగా పలువురు అఖిలపక్ష నేతలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణకు గుండెకాయలాంటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఆయనే అంకురార్పణ చేశారని పేర్కొన్నారు. శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ సురేష్షెట్కార్, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ తదితరులు సభలో వైఎస్ఆర్ను గుర్తు చేశారు.
కేసీఆర్ది అనైతిక పాలన
Published Wed, Dec 30 2015 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement