అక్రమంగా తరలిస్తున్న రేషన్ స్వాధీనం | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న రేషన్ స్వాధీనం

Published Thu, Mar 17 2016 4:49 PM

illegally Trafficking Ration seized

అక్రమంగా తరలిస్తున్న రేషన్ సరుకులను కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండల పోలీసులు గురువారం పట్టుకున్నారు. ట్రాలీ ఆటోలో రేషన్ సరుకులను తరలిస్తుండగా రేగుంట గ్రామ సమీపంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని, 200 లీటర్ల కిరోసిన్, 16 క్వింటాళ్ల గోధుమలు, నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సరుకులను రాయికల్, మల్లాపూర్ మండలాల్లో అక్రమంగా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు తేలిందని ఎస్సై జానీపాషా తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement
Advertisement