ఆర్టీసీకి భారీగా ఆదాయం..
సదుపాయూల్లో మాత్రం విఫలం
ఖమ్మం : ఏ బస్సు చూసినా పుష్కరబాటలోనే..భద్రాచలం, కాళేశ్వరం, రాజమండ్రి, బాసర, ధర్మపురి.. వంటి పుష్కరఘాట్లకే తప్ప సాధారణ రూట్లలో బస్సులు లేక ఆర్టీసీ ప్రయాణికులు వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. అధిక ఆదాయం మోజులో రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసి పుష్కర స్పెషల్స్గా మార్చడంతో సాధారణ ప్రయాణికుల బాధలు వర్ణణాతీతంగా మారారుు. గంటలకొద్దీ బస్ స్టాప్లో ఎదురుచూసినా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ప్రయూణికులు వాపోతున్నారు. పుష్కరాలు ఎప్పుడు ముగుస్తాయా..? అని రోజులు లెక్కేసుకుంటున్నారు. ఇటు పలు రైళ్లను కూడా పుష్కర స్పెషల్స్గా మార్చడం.. ఉదయం రావాల్సిన రైళ్లు రాత్రికి కూడా రాకపోవడంతో ప్రయాణికుల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నారుు.
500 సర్వీసులు పుష్కరదారిలోనే..
జిల్లాలో ఆరు డిపోలు ఉన్నారుు. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం డిపోల పరిధిలో మొత్తం 636 సర్వీసులు నడుస్తున్నారుు. వీటిలో ప్రతి డిపో నుంచి హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలు, పుణ్యక్షేత్రాలకు బస్సులు నడుస్తారుు. వీటితోపాటు పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసులు మారుమూల ప్రాంతాలకు వెళ్తుంటారుు. పుష్కరాల సందర్భంగా ఆరు డిపోల పరిధిలోని 360 బస్సులు, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ, వనపర్తి, ఇతర ప్రాంతాల నుంచి 140 సర్వీసులను తీసుకొని మొత్తం 500 బస్సులను పుష్కర స్పెషల్స్గా తిప్పుతున్నారు.
జిల్లా బస్సులతో పాటు ఇతర డిపోలు తొర్రూరు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, తిరువూరు డిపోల బస్సులను కూడా కుదించారు. వీటిలోనూ ఎక్కువ సర్వీసులను పుష్కరాలకే నడుపుతున్నారు. వివిధ పనుల నిమిత్తం పల్లె నుంచి పట్టణాలకు వచ్చేవారు, పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు నరకం చవిచూస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరుతో అదనపు చార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు రెగ్యులర్ ప్రయూణికుల విషయూన్నే మర్చిపోవడం విమర్శలకు తావిస్తోంది.
పెరిగిన ఆదాయంతో ఆర్టీసీలో ఆనందం
పెరిగిన ఆదాయంతో ఆర్టీసీ అధికారులు తెగ సంబరపడి పోతున్నారు. గతంలో ఆరు డిపోల పరిధిలో రోజుకు రూ.65 లక్షల ఆదాయం వచ్చేది. పుష్కరాలకు రోజుకు 60 లక్షల అదనపు ఆదాయం లభించింది. దాదాపు 1.25 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ పండగ చేసుకుంటోంది. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం డిపోల పరిధిలోనే రోజుకు ఒక్కో డిపోకు 15 లక్షలకు పైగా అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు లెక్కలు వేసి చెబుతున్నారు. రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో ప్రయూణికులు ఇక తమ కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నారు.
ప్రయాణం.. నరకప్రాయం
Published Fri, Jul 24 2015 2:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement