లబ్ధిదారుల్లో అయోమయం
- టీఆర్ఎస్ హామీతో..
- రూ.3 లక్షలతో డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తానన్న కేసీఆర్
- ఇందిరమ్మ కింద వచ్చేది రూ. లక్ష లోపే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో ‘ఇందిరమ్మ లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ‘120 గజాల స్థలంలో రెండు పడక గదులు, ఓ వంట గది, బాత్రూమ్ను రూ. 3 లక్షలతో మేమే ఇండ్లు నిర్మించి ఇస్తాం’ అన్న కేసీఆర్ ప్రకటన లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. టీఆర్ఎస్ రథసారథి, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల నేపథ్యంలో ఇప్పటికే మంజూరైన ఇళ్ల ను నిర్మించుకోవడమా? లేక కొత్త మంజూరు కోసం వేచి చూడటమా? అన్న సందేహంలో పడ్డారు.
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పలు విడతల్లో జిల్లాకు 2,41,887 ఇండ్లు ుంజూరయ్యాయి. ఇందులో 1,28,583 ఇండ్లు పూర్తయ్యాయి. పురోగతిలో 29,326 ఇండ్లు ఉన్నాయి.అసలు మొదలు కాని ఇండ్లు 29,687 వరకు ఉన్నాయి.
జూన్ 2న నుంచి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానుండగా... ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 120 గజాల స్థలంలో రెండు పడక, ఓ వంటగది, బాత్రూమ్ సహా నిర్మించుకోవచ్చన్న ఆలోచనలో ఇందిరమ్మ లబ్ధిదారులు పడ్డారు. కొత్త ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేస్తుందా? ఇది వరకున్న ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులను మినహాయిస్తుందా? ఇంతకీ ‘ఇందిరమ్మ’ దారెటన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇండ్లను ప్రస్తుతం 240 చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.
16 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో నిర్మించే ఈ ఇళ్లపై ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీయేతరులకు రూ.70 వేలు చెల్లిస్తుంది. షెడ్యూల్ తెగలకు రూ.1.05 లక్షలు, షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు రూ.1లక్ష వివిధ దశలు, రూపాల్లో చెల్లిస్తుంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 120 గజాల స్థలంలో ఒక్కో లబ్ధిదారునికి రూ.3 లక్షలు వెచ్చించి ఇండ్ల నిర్మాణం చేసిస్తామని హామీ ఇచ్చారు.
అత్యధిక స్థానాలు సాధించుకుని జూన్ 2న ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో ఇంకా ఇండ్ల నిర్మాణం మొదలెట్టని లబ్ధిదారులు సందిగ్ధంలో పడ్డారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుందా? లేక వాటి స్థానంలో కొత్తగా మంజూరు ఇస్తుందా? ఇంకా మొదలెట్టని ఇండ్ల స్థానంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి.
Related news
-
నేడు ఉమ్మడి మహబూబ్నగర్లో కేసీఆర్ పర్యటన
సాక్షి, మహబూబ్నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్నగర్ వరకు భారీ రోడ్షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడనున్నారు.రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్కర్నూల్కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి. -
12 లోక్సభ సీట్లు ఇవ్వండి.. ప్రభుత్వం మెడలు వంచుతాం: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా.. ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నా.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీలన్నీ ఎగబెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికల కోసం ప్రజలకు ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు.కాంగ్రెస్ వచ్చాక రైతు బంధులో దగా చేస్తోందని.. రైతుబీమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. కరెంటు సరిగా రావడం లేదని, నీళ్లు అందడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే.. భూమి, ఆకాశం ఒక్కటయ్యేలా ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సుయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలలో నిర్వహించిన రోడ్షోలలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘1956 నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకు శత్రువు. అప్పుడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపి 58 ఏళ్లు గోస పెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి, బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన çహామీలన్నీ ఎగబెట్టింది. మళ్లీ లోక్సభ ఎన్నికల కోసం ప్రజల ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతాం. హామీలు అమలు చేయించగలుగుతాం. ఆ బాధ్యత నాదే. ప్రజలిచ్చే బలంతోనే పోరాటం చేయగలుతాం. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. కరెంటు సరిగ్గా వస్తుంది. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు, కాంగ్రెస్కు మధ్య పంచాయితీ వచ్చింది. ఆ పంచాయితీకి ప్రజల తరఫున పెద్ద మనిషిగా నేనుంటా. పంటలు ఎండటం ఇదే మొదటిసారి బీఆర్ఎస్ తొమ్మిళ్ల పాలనలో 18 పంటలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సాగర్ ఆయకట్టు నీళ్లు ఇచ్చి బంగారు పంటలు పండించాం. ఇప్పుడు నాగార్జున సాగర్లో నీళ్లున్నా, ఇచ్చే అవకాశమున్నా.. కాంగ్రెస్ దద్దమ్మలకు దమ్ములేక, ప్రాజెక్టును తీసుకుపోయి కృష్ణాబోర్డు చేతిలో పెట్టారు. మొత్తం పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చాక పంటలు ఎండిపోవడం ఇదే మొదటిసారి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంట్.. దిగిపోగానే మాయమైపోయిందా? కేసీఆర్ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును నడిపించలేని అసమర్థులు ఈరోజు ఏలుతున్నారు. ఎందుకు చేతనవడం లేదు? ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నారు? మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు? ప్రజలకు నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? రైతులకు అన్యాయం జీవితాన్ని పణంగా పెట్టి, ఆమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక్కో మెట్టు కట్టుకొంటూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో ప్రజలకు తెలుసు. అలాంటి రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మేం రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా ఏటా 15, 16 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చాం. ఇప్పుడు రైతుబంధు ఐదు ఎకరాలకేనంటూ ఎగబెడుతున్నారు. ఎందుకిలా? రైతులకు ఇవ్వడానికి మీకేం బాధ.అదేమైనా మీ అబ్బ సొత్తా..? రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలి. బీఆర్ఎస్ రెండు దఫాలుగా రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేసి, రైతు లను ఆదుకుంది. ఈరోజున్న సీఎం కొన్ని నెలల కింద పరుగెత్తుకొని వచ్చి డిసెంబరు 9 నాడు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎందుకు చేయలేదు? ఎందుకింత మోసం చేశారు? నన్ను తిట్టినా ఫర్వాలేదు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే నా ప్రాణం పోయినా వదిలిపెట్టబోను. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా. ధాన్యం ఎందుకు కొనడం లేదు? తన బస్సుయాత్ర వచ్చే దారిలో ఆర్జాలబావి వద్ద రైతులు ఆపి గోడు వెళ్లబోసుకున్నారు. ధాన్యం తెచ్చి 25 రోజులు అవుతున్నా కొనడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? ఒకసారి ప్రధాని మోదీ వడ్లు కొనబోమని మొండికేస్తే ఢిల్లీలో ధర్నా చేసినం. మోదీ మెడలు వంచి, మద్దతు ధరతో తెలంగాణ ధాన్యం కొనేలా చేశాం. ఏపీ నీళ్లు తరలించుకుంటే నోరు మెదపరేం.. నీళ్లు, నిధుల కోసం, కరెంటు కోసం, ప్రజల కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. కేసీఆర్ పక్కకు జరిగిన నాలుగైదు నెలలకే నీళ్లు ఎలా మాయమైపోయాయి? నాలుగైదు నెలల కింద ధీమాతో ఉన్న రైతులు.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఇవాళ మళ్లీ బాధలో పడ్డారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నల్లగొండ జిల్లాలోనే ఉన్నా దద్దమ్మలాగా.. నాగార్జునసాగర్ డ్యామ్పై అధికారాన్ని కేంద్రానికి అప్పజెప్పారు. నీళ్లివ్వడం చేతనైతలేదా? సాగర్ టెయిల్ పాండ్ నుంచి 5 టీఎంసీల నీళ్లను ఏపీ వాళ్లు తీసుకెళ్లారు. అయినా మంత్రి ఉత్తమ్ నోరు మెదపకుండా ఎక్కడ పడుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే 60–70 టీఎంసీల నీళ్లను వదిలేసి రాకుండా చేశారు. తులం బంగారం ఏమైంది? మా హయాంలో రూ.200 పెన్షన్ను రూ.2 వేలు చేసుకున్నాం. దళిత బిడ్డలను లక్షాధికారులను చేసేందుకు దళితబంధు అమలు చేశాం. పేదబిడ్డలకు పెళ్లి చేయాలని రూ.లక్ష ఇచ్చేలా కల్యాణలక్ష్మి పెట్టాం. కాంగ్రెస్ వాళ్లు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు? పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామన్న హామీ ఏమైంది? నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఏమైంది?’’అని కేసీఆర్ నిలదీశారు. కేసీఆర్ కాన్వాయ్లో వాహనాలు ఢీ మిర్యాలగూడ టౌన్: కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా మిర్యాలగూడలో రోడ్ షోకు వెళ్తుండగా.. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొకటిగా వరుసగా 10 వాహనాలు ఢీకొన్నాయి. ఆ వాహనాల ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.కేసీఆర్ భయపడతడా? ‘‘నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో 225 మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారు. గురుకులాల్లో తిండి సరిగా పెట్టడం లేదు. 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై.. నలుగురు ఐదుగురు చనిపోయారు. దానిపై ప్రశ్నిస్తే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జైల్లో వేస్తామంటున్నారు. కేసీఆర్ భయపడతాడా? అలా భయపడితే తెలంగాణ వచ్చేదా? పేగులు తీసి మెడలేసుకుంటం, గుడ్లు తీసి గోలీలాడుతం, పండబెట్టి తొక్కుతం అంటూ సీఎం మాట్లాడుతున్నారు. కేసీఆర్ చెడ్డీ ఊడబీకుతామంటున్నారు. నా చెడ్డీతో ఏం చేసుకుంటారు? ఒక మాజీ సీఎంను టార్గెట్ చేసే విధానం ఇదేనా? 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడుతారా? ప్రజలు ఆలోచించాలి’’ తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. లోక్సభ ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ప్రారంభించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర బుధవారం మధ్యాహ్నం మొదలైంది. ఒంటి గంట సమయంలో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు కేసీఆర్ చేరుకున్నారు. పార్టీ మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం ప్రత్యేక బస్సులో, కాన్వాయ్తో బయలుదేరారు. ఇన్నాళ్లూ తెలంగాణ భవన్ దక్షిణ గేటు నుంచి రాకపోకలు సాగించిన కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈశాన్య ద్వారం నుంచి బస్సు యాత్రకు బయలుదేరారు.మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో వేచి ఉన్న పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. నల్లగొండ పట్టణ శివారులోని అన్నెపర్తి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. తర్వాత ఆర్జాలబావి వద్ద కూడా రైతులతో మాట్లాడి.. వారి బాధలను తెలుసుకున్నారు. మాడ్గులపల్లిలోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. తర్వాత మిర్యాలగూ డ, సూర్యాపేట రోడ్ షోలలో ప్రసంగించారు. రాత్రి సూర్యాపేటలోని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బస చేశారు. నేడు భువనగిరిలో రోడ్ షో బస్సుయాత్రలో భాగంగా రెండో రోజు గురువారం సాయంత్రం వరకు కేసీఆర్ సూర్యాపేటలోనే ఉండనున్నారు. నల్లగొండ, భువనగిరి లోక్సభ సెగ్మెంట్ల నేతలతో ప్రచార సరళిని సమీక్షించనున్నారు. సాయంత్రం భువనగిరిలో నిర్వహించే రోడ్ షోలో ప్రసంగిస్తారు. మొత్తంగా మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల మీదుగా కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. రైతులతో కేసీఆర్ మాటా మంతీ నల్లగొండ రూరల్: కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా నల్లగొండ మండలం అన్నెపర్తి, ఆర్జాలబావి గ్రామాల వద్ద రైతులతో మాట్లాడారు. అన్నెపర్తి వద్ద.. రైతు వెంకన్న: రైతుల పరిస్థితి ఆగమాగం ఉంది సార్.. కేసీఆర్: ఎందుకు.. ఏమైంది? రైతు: మీరు దిగిపోయారు. వానలు లేవు. వడ్లకు బోనస్ లేదు, రుణమాఫీ చెయ్యలేదు. కేసీఆర్: ఇటు రాండ్రి.. బాగున్నారా.. (మాజీ సర్పంచ్ అరవింద్రెడ్డి, మాజీ ఎంçపీటీసీ ఆండాలు, గట్టయ్యలను పిలిచారు) మాజీ ప్రజాప్రతినిధులు: బాగున్నాం సార్. ఐకేపీ సెంటర్లో బాధలు చూడాలి సార్. కేసీఆర్: ఎలాంటి సమస్య ఉన్నా పోరాడుదాం. ఏదైనా ఉంటే భూపాల్రెడ్డి (నల్లగొండ మాజీ ఎమ్మెల్యే), కృష్ణారెడ్డి (బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి)కి చెప్పండి. దాన్ని తీర్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఆర్జాలబావి వద్ద.. రైతు గుండగోని పాపయ్య: సార్, మీ పాలనే బాగుండే. 20 రోజులైంది ధాన్యం తూకం కాలేదు. బోనస్ లేదు. రుణమాఫీలేదు. చెరువుల్లో నీళ్లు లేవు.. సక్రమంగా కరెంటు లేదు. రైతు బంధు రాలే. మళ్లీ మీరే రావాలి సార్. కేసీఆర్: ధాన్యం కొంటలేరా? రైతు: కొంటలేరు సార్. ఎండకు చస్తున్నాం. కేసీఆర్: అందరూ రెడీగా ఉండండి.. పోరాటం చేద్దాం.. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చరో చూద్దాం. -
బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పవర్ విషయంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న ఉత్తమ్.. సీఆర్కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్లో ఎవరూ ఉండరంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనమరుగవుతుందన్నారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చెప్పేవనీ అసత్యాలేనని ఉత్తమ్ అన్నారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయింది.. దానికి కరెంటు పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారం. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదు.. గత పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇరిగేషన్పై మాట్లాడే అర్హత కేసీఆర్కి లేదు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారు’’ అంటూ ఉత్తమ్కుమార్రెడ్డి దుయ్యబట్టారు. -
కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేసీఆర్
ఇది పాలకుల అసమర్థత కాదా? రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు? కేసీఆర్ గడప దాటగానే కట్టేసినట్టుగా బంద్ అవుతదా? ఇది పాలకుల అసమర్థత కాదా? ఆలోచించాలి. మేం టెక్నోక్రాట్లను పెట్టి విద్యుత్ శాఖను నడిపాం. ఎలా బాగా నడపవచ్చో వారికి తెలుసు కాబట్టే సమర్థంగా నడిచింది. ఇప్పుడు ఐఏఎస్ను నియమించారు. వారికి విషయం పట్టుబడదు.. మంత్రులు పట్టించుకోరు. తీరిక లేదు. ఈ పాలకులకు రాజకీయాల కోసం తీరిక ఉందిగానీ.. ప్రజల కోసం తీరిక లేదు. సీఎం ఎక్కడ పడుకున్నరు? గత డిసెంబర్ 9వ తేదీనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. డిసెంబర్ 9 పోయి ఎన్నాళ్లయింది? నాలుగు నెలలు అవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడున్నరు? ఎక్కడ పడుకున్నరు? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేం వెంటపడి తరుముతాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా విడిచిపెట్టేది లేదు. కేవలం 1.8 శాతం ఓట్లతో గెలిచావు. మిమ్మల్ని తరిమికొడతాం. నిద్రపోనియ్యం. వెంటనే రుణమాఫీ చేసి తీరాల్సిందే. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అసమర్థ, తెలివిలేని, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆరోపించారు. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వెంటాడి, వేటాడుతామన్నారు. ధర్నాలు చేస్తామని.. అవసరమైతే ఎక్కడికక్కడ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వరికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏప్రిల్ 2, 6 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రెస్మీట్లో కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించా. చాలాచోట్ల రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోయామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పరిహారం ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే నమ్మి పంటలు వేశామని.. మొదటే ఇవ్వబోమని చెప్పి ఉంటే వేసుకునే వాళ్లం కాదని వాపోయారు. ప్రభుత్వం మొదట ఇచ్చి తర్వాత బంద్ చేసి నష్టం చేకూర్చిందని బాధపడ్డారు. మేం ఏడెనిమిదేళ్లలో వ్యవసాయ స్థిరీకరణతో, స్పష్టమైన విధానాలతో రైతులు బాగుపడేలా చేశాం. ఇన్నాళ్లూ ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణలో వంద రోజుల్లోనే దుర్భరమైన పరిస్థితిని చూస్తామనుకోలేదు. రైతులు ఇంతగా ఏడ్చే పరిస్థితి వస్తుందనుకోలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దుస్థితి రాష్ట్రంలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తం.. మేం రూ.35వేల కోట్లు వెచ్చించి అగ్రగామిగా నిలిపిన విద్యుత్ రంగం.. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు మారింది? ఉన్న వ్యవస్థను ఉన్నట్టు నడిపించలేని ఈ అసమర్థత ఏందీ? ఉన్న దాన్ని ఉన్నట్టు నడిపించే తెలివిలేకపోతే ఎలా? ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ, ప్రభుత్వ అసమర్థత, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యమే. మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నయ్. మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మేం పవర్గ్రిడ్కు అనుసంధానించి.. కరెంట్ సరఫరాలో ఇబ్బంది ఏర్పడిన సమయంలో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ తీసుకునే విధంగా చేశాం. 7వేల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీని 18 వేల మెగావాట్లకు పెంచాం. అదనంగా 1,600 రామగుండంలో, 4 వేలు యాదాద్రి థర్మల్ స్టేషన్లో కలిపి 5,600 మెగావాట్లు అదనంగా వచ్చే పరిస్థితి కల్పించాం. ఈ ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ను పట్టించుకోవడం లేదు. పట్టించుకుని ఉంటే రెండు యూనిట్ల ద్వారా సొంతంగా మరో 1,500 మెగావాట్లు వచ్చేది. ఇంత ఉజ్వలమైన పవర్ సిస్టం ఉన్నా ఎందుకు ఇబ్బంది అవుతోంది? అవసరమైనప్పుడు కరెంటు కొనాలె.. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైతే ప్రభుత్వం అప్పులు చేయాలె. పీక్ అవర్స్లో ఎంత షార్టేజ్ ఉంటే అంత కరెంటు కొనాలి. రైతులకు ఇవ్వాలి. మేం అదే చేశాం. అందుకే ఆనాడు రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. మేం ఉన్నప్పటికంటే ఇప్పుడు లోడ్ ఐదారు వందల మెగావాట్లు డిమాండ్ పెరిగింది. కానీ ప్రభుత్వం అవసరమైనంత కొంటలేదు. అందుకే కరెంటు వస్తలేదు. ఎనిమిదేళ్లుగా కాలిపోని మోటార్లు ఇప్పుడు కాలిపోతున్నాయని చాలా మంది రైతులు చెప్పారు. రోజుకు ఆరేడుసార్లు వస్తోంది, పోతోంది. అయినా సర్కారుకు చీమ కుట్టినట్టు లేదు. మేం రైతుల గురించి రూ.20, 30 వేల కోట్లు అయినా పెట్టాం. గట్టిగా పంటలు పండితే అవి నాలుగేళ్లలో తీరిపోయాయి. పంటలు ఎందుకు ఎండుతున్నాయి రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లానే లేదు. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 3.5 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల్లో పంట ఎండింది. ప్రతి ఊళ్లో 200 నుంచి 400 ఎకరాల దాకా ఎండిపోతోంది. సాగర్ ఆయకట్టు ఎందుకు ఎండుతోంది? ఈ రోజు కూడా సాగర్లో మినిమమ్ డ్రాడౌన్ లెవల్ (ఎండీడీఎల్) కంటే పైన 7 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కింద మరో ఏడెనిమిది టీఎంసీలు వాడుకోవచ్చు. అంటే 14, 15 టీఎంసీల నీళ్లు వాడుకునే పరిస్థితి ఉంది. కానీ తెలివి హీనంగా సాగర్ ప్రాజెక్టును కృష్ణాబోర్డుకు అప్పగించి, సాగర్ కట్టమీదకు వెళ్లలేని దుస్థితిని తీసుకొచ్చారు. ప్రభుత్వం మెడలు వంచుతాం ఖమ్మం, మహబూబ్నగర్, ఇతర జిల్లాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. రూ.500 కోట్లను రైతులకు అందించాం. అప్పుడు అది సరిపోదని, రూ.20 వేల చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే వడగళ్ల వాన పడి నష్టపోతే అడిగే దిక్కులేదు. అకాల వర్షాలతో లక్ష ఎకరాల్లో పంట దెబ్బతిన్నా.. మాట్లాడేవాళ్లు లేరు. మంత్రి పోడు, ఎమ్మెల్యే పోడు.. ఎంపీలు పోరు, అధికారుల బృందాలు పోవు.. దొంగల్లా ముఖం చాటేస్తారు. ముఖ్యమంత్రికి పట్టింపే లేదు. ఆయనకు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి.. ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోయాయి కాబట్టి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఏయే జిల్లాల్లో, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతెంత పంట ఎండిపోయిందనే లెక్కలు తీయాలి. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇచ్చే దాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తాం. ఎక్కడికక్కడ మంత్రులు, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి. కచ్చితంగా లెక్కలు తీస్తాం. మిమ్మల్ని బజారుకీడుస్తాం. హామీ ఇచ్చినట్టుగా వరికి రూ.500 బోనస్ కూడా ఇవ్వాలి. ఇందుకోసం కోసం ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తాం. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యేలు, మేము ఇస్తాం. 6వ తేదీన నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేస్తాం. కళ్లాల వద్ద నిలదీస్తాం. ఆత్మహత్యలు చేసుకోవద్దు నేను రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా.. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్ఎస్ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు. మీ తరపున పోరాడుతాం. నేను మీ వెంటే ఉంటా. హక్కులను సాధించుకుందాం..’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చిల్లర రాజకీయాలతో కాళేశ్వరంలోని నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీల్లో నీటిని వదిలిపెట్టి, సీపేజీలో పోయే నీటిని ఫొటోలు తీసి, వీడియోలు తీసి, ప్రాజెక్టు ఖతం అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు. నిన్న యూపీలోనో, బిహార్లోనో బ్రిడ్జి కూలిపోయింది. ప్రపంచం మునిగిపోయిందా? మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాట్లాడుతున్నరు. నాగార్జునసాగర్ కుడివైపు కుంగలేదా? పునరుద్ధరించలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? అమెరికాలో ఓ డ్యాం నాలుగుసార్లు కొట్టుకుపోయింది. వారు విడిచిపెట్టారా? కొందరు ఇంజనీర్ల తప్పువల్లనో, అనుకోకుండా ఏర్పడిన సమస్యతోనో, జియాలజీ సమస్యతోనో ఓ పిల్లర్ కింద ఇసుక కొట్టుకపోతే.. ప్రపంచం బద్ధలైనట్టు, ప్రళయం వచ్చినట్టు చిల్లర కథలు చెప్పి నీళ్లివ్వడం లేదు. మరి సమ్మక్క బ్యారేజీకి ఏమైంది. దేవాదుల నుంచి ఎందుకు పంప్ చేయట్లేదు. ఒక్కసారిగా నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? ప్రపంచ దేశాలు కొనియాడిన మిషన్ భగీరథ ఉండగా ఎందుకు మంచి నీళ్ల కొరత వచ్చింది? ఐదేళ్లు బ్రహా్మండంగా నడిచిన పథకంలో ఎందుకు లోపం వస్తుంది? ఎందుకు ఇప్పుడు బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్? ఎందుకు నీటి సమస్య వస్తోంది. హైదరాబాద్ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది? ఇందుకు కారణం సీఎం, మంత్రులే. రాష్ట్రంలో ఏం జరుగుతోందనే సమీక్ష చేయడం లేదు. వారికి పట్టింపు లేదు. పథకాన్ని వాడుకునే తెలివి లేదు. ఏదైనా పాడైతే ఇప్పుడు 15 రోజులైనా పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావాలంటే నాణ్యమైన విద్యుత్ 24 గంటల సరఫరా ఉండాలి. దానిపై దృష్టి లేదు. జూన్ దాకా అంటే మరో మూడు నెలల వరకు వానలు పడే అవకాశం లేదు. ఇంకా నీటి సమస్య తీవ్రం కాకుండా మిషన్ భగీరథను పునరుద్ధరించాలి. -
కేకే పార్టీ జంప్.! కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే?
సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెలవు మరి.! ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్ భావించారు కానీ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది. లోపల గరం.. గరం ఫాంహౌస్ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. కేకే అభ్యంతరాలు ఇవి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు కూతురు వెంటే కేకే ఇప్పటికే కాంగ్రెస్లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కేసీఆర్.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్లో అత్యంత సీనియర్. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. పోతూ పోతూ విసుర్లు పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కేకే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది. మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్ "పార్టీ మారే ఆలోచనలో కె.కె, విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను." ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన
Related News by category
-
సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచారు. అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఉద్యమ కాలం నాటి తన ఫొటోను కేసీఆర్ జత చేశారు.బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు. నేడు నాగర్కర్నూల్కుశనివారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. -
271 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: లోక్సభ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం రాత్రి ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 271 మంది అభ్యర్థుల నామినేషన్లను పరిశీలన అనంతరం అధికారులు తిరస్కరించారు. 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. తిరస్కరణకు కారణాలెన్నో: నామినేషన్ పత్రా ల్లోని అన్ని కాలమ్స్ పూరించాల్సి ఉండగా, కొందరు అభ్యర్థులు కొన్ని కాలమ్స్ను భర్తీ చేయకుండా వదిలివేయడం, పత్రాలపై కొన్నిచోట్లలో సంతకాలు చేయకపోవడం వంటి కారణాలతో చాలా మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కనీసం 10 మంది ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులను ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. కొందరు స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ఓటర్లు కూడా ప్రతిపాదించకపోవడంతో వారి నామినేషన్లను సైతం జిల్లా ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్ నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి బీఎస్పీ తరఫున మాజీ ఎంపీ మందా జగన్నాథం వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇటీవల అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరిన ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే బీఎస్పీకి సంబంధించి బీఫాం అందజేయకపోవడంతో నామినేషన్ తిర్కరణకు గురై¯ంది. నామినేషన్ పత్రాల్లో నో అబ్జెక్షన్పత్రం అందజేయకపోవడం, గడువులోగా సమర్పించాల్సి ఉన్నా సమరి్పంచకపోవడంతో నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. అయితే బీఎస్పీ తరఫున మరో అభ్యర్థి యోసేఫ్ నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ బీఫాంను అతనికి అందజేసింది. -
హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాస్రావు,జస్టిస్ రాజేశ్వర్రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియ జేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్రావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరినీ శాశ్వత న్యాయమూర్తు్తలుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో 1969, ఆగస్టు 31న జగ్గన్నగారి శ్రీనివాస్రావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీబాయి, మాణిక్యరావు. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999 ఏప్రిల్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో సమర్థంగా వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే వరకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఈ రెండేళ్లలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. ఆయనకు భార్య శ్రీలత ఇద్దరు పిల్లలు ప్రణీత్, ప్రక్షిప్త ఉన్నారు. 2001లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మహబూబాబాద్ జిల్లా సూదన్పల్లిలో 1969 జూన్ 30న నామవరపు రాజేశ్వర్రావు జన్మించారు. తల్లిదండ్రులు గిరిజాకుమారి, సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్లో.. హైసూ్కల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్లో పూర్తి చేశారు. ఓయూ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. 2001 ఫిబ్రవరి 22న న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తొలుత సీవీ రాములు కార్యాలయంలో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు విధులు నిర్వర్తించారు. యూజీసీ న్యాయవాదిగానూ పనిచేశారు. 2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్గా విధులు నిర్వహించారు. 2019 నవంబర్ నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా పనిచేస్తూ 2022 ఆగస్టు 16న అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందారు. దాదాపు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. -
నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కోడ్ దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని శుక్రవారంపిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలతో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు.జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ భవన్లో కేటీ రామారావు పార్టీ జెండాను శనివారం ఉదయం 9 గంటలకు ఆవిష్కరించనున్నారు. -
హరీశ్రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీశ్రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అంటూ సీఎం రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హరీశ్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా?. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు.. రాజీనామా లేఖ అలా ఉండదు.. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు’’ అని ఎద్దేవా చేశారు.స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు. హరీశ్ తెలివి ప్రదర్శిస్తున్నారు.. ఆయన తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుంది.. హరీశ్..ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ను కచ్చితంగా స్వీకరిస్తున్నాం.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. నీ రాజీనామా రెడీగా పెట్టుకో’’ అంటూ రేవంత్ సవాల్ విసిరారు.రాజీనామా పేరుతో మళ్లీ హరీశ్ జోకర్ అయ్యాడు:మంత్రి కోమటిరెడ్డిమరోసారి రాజీనామా లేఖ పేరుతో హరీశ్రావు డ్రామాలు చేస్తున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. హరీశ్ బీఆర్ఎస్లో ఉద్యోగి మాత్రమే. ఆగస్టు 15లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశాం. హరీశ్రావుకు పర్సనాలిటీ పెరిగింది కానీ.. బుర్ర మాత్రం పెరగలేదు. నీ దగ్గరకు పని కోసం వస్తే మంత్రిగా ఒక్క పని చేయకలేకపోయావు. రాజీనామా పేరుతో మళ్లీ హరీశ్రావు జోకర్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి దుయ్యబట్టారు.హరీశ్రావుది దొంగ రాజీనామా. మీరు దొంగ దీక్షలు చేసినట్లు ఇప్పుడు చేస్తే నడవదు.ఇవాళ మళ్లీ మోసం చేయానికి వచ్చిండు.. నువ్వు డ్రామాలు ఆడితే ప్రజలు పట్టించుకోరు.. నువ్వు కేసీఆర్ కింద గులాం గిరి చేయాలి తప్ప నిన్ను ఎవరు పట్టించుకోరు.. 20 ఎండ్ల కింద 76 వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దమ్ముంటే మెదక్లో డిపాజిట్ తెచ్చుకో.. బీఆర్ఎస్ పార్టీ జూన్ 4 నుంచి దుకాణం బంద్ అవుతుంది. కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేశారా?. తెలంగాణా వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తా.. లేకుంటే నా మెడ మీద తలకాయ ఉండదు అన్నాడు.. నువ్వు తీసుకోలేదు తలకాయ మమ్మల్ని తీయమంటావా? లేకుంటే దళితులను తీయమంటావా?’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement