సౌదీలో కరీంనగర్ వాసి హత్య | Sakshi
Sakshi News home page

సౌదీలో కరీంనగర్ వాసి హత్య

Published Tue, Jul 21 2015 6:15 PM

Indian murdered in Saudi

కరీంనగర్ (కథలాపూర్) : కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన ఓలవేలి నర్సయ్య(40) సోమవారం రాత్రి సౌదీ దేశంలో హత్యకు గురైనట్లు మంగళవారం కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. కంపెనీ యజమాని రెండు సంవత్సరాలుగా జీతం చెల్లించకుండా పని చేయించుకుంటున్న విషయాన్ని ప్రశ్నించినందుకు యజమాని.. నర్సయ్యను హత్య చేసినట్లు తెలిసింది. నర్సయ్య సౌదీలో నజరాన్ అనే ప్రాంతంలో గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement