- గద్వాలలో ఇందిరమ్మ ఇళ్లల్లో భారీగా అక్రమాలు
- సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- మాజీ కౌన్సిలర్లే సూత్రధారులని ఆరోపణలు
- గతంలో గుర్తించిన అక్రమార్కులపై చర్యలు శూన్యం
గద్వాల: గద్వాల పట్టణంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లల్లో అక్రమాలు భారీగా చోటుచేసుకున్నాయి. పేదల సొమ్మును కొందరు అక్రమార్కులు దర్జాగా మెక్కేశారు. గతంలో గుర్తించిన అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోగా.. ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ గృహనిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. 2004 నుంచి 2014 వరకు గద్వాల పట్టణానికి సుమారు 2005 పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో పిల్లగుండ్ల ఇందిరమ్మ కాలనీకి 200 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే పట్టణంలో 80 శాతం ఇళ్లు పూర్తయినట్లు గృహనిర్మాణశాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ అందులో 30 శాతం ఇళ్లు కూడా పూర్తికాలేదన్నది వాస్తవం.
పట్టణంలో ఒకరి పేర రెండు, మూడిళ్లు మంజూరయ్యాయి. ఒకే ఇళ్లుపై అనేకమార్లు బిల్లులు తీసుకున్నట్లు కూడా తేలింది. నిర్మాణాలు జరగకుండానే పట్టణంలోని కొందరు మాజీ కౌన్సిలర్ల చేతుల్లోకి దాదాపు రూ.2కోట్ల మేర ప్రజాధనం వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. మం జూరైన ఇళ్ల నిర్మాణాల చెల్లింపులు, లబ్ధిదారుల ఎంపిక తదితర స్థాయిలో గత మూడేళ్ల క్రితం సదరు వ్యక్తులు పెద్దఎత్తున లాబీయింగ్ చేయడంతో అక్రమాలు కోట్లు దాటాయి. ఈ క్రమంలో 2008లో జరిగిన విచారణ మధ్యలోనే ఆగిపోయింది. 2009లో అప్పటి ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్లల్లో జరిగిన అక్రమాలపై థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించింది. అక్రమాల నిగ్గుతేల్చకుండానే అధికారులు ఫైళ్లను మూలకుపడేశారు.
అధికారుల విచారణకు సహకరించని పీడీ కార్యాలయం
గద్వాల పట్టణంలో మూడేళ్ల క్రితం థర్డ్ పార్టీ విచారణ జరిగింది. అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రూ.28లక్షల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. చాలా ఇళ్లు లబ్ధిదారుల పేర్లు కాకుండా మరో వ్యక్తి పేరుతో ఫొటోలు మార్చి రుణాలు పొందారని తేల్చారు. అదేవిధంగా గద్వాల నియోజకవర్గంలోని ధరూరు, గట్టు, మల్దకల్, గద్వాల మండలాల్లో అధికారుల బృందాలు ఇందిరమ్మ అక్రమాలపై సర్వేలు నిర్వహించి తుది నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించారు.
హౌసింగ్ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా...
2011 మార్చి 14న హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాల మేరకు జిల్లా హౌసింగ్ అధికారులు గద్వాల ఇందిరమ్మ ఇంటిదొంగలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గద్వాల హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలను సమగ్రంగా అందిస్తేనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని అప్పట్లో పట్టణ ఎస్ఐ, సీఐలు హౌసింగ్ డీఈఈకి తేల్చిచెప్పారు. థర్డ్ పార్టీ విచారణ వివరాలు అందించాలని డీఈఈ జిల్లా హౌసింగ్ పీడీ కార్యాలయానికి లేఖరాసినా ఇంతవరకు సమాధానం రాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించడంతో గద్వాల పట్టణంలో ఆసక్తి నెలకొంది.
గుట్టు రట్టయ్యేనా..?
Published Mon, Jul 28 2014 2:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement