వేలేరుపాడు: ఆంధ్రాలోని బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసమే పోలవరం ముంపు మండలాల విలీన ఆర్డినెన్స్ను కేంద్ర సర్కారు తీసుకొచ్చిందని రాష్ట్ర మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి విఎస్.కృష్ణ విమర్శించారు. లక్షలాది మంది ఆదివాసీల జీవితాలను, వారి సంస్కృతీ సాంప్రదాయాలను నిలువునా ముంచుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత దుర్మార్గమైనదని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ భారీ ప్రదర్శన, తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి విఎస్.కృష్ణ మాట్లాడుతూ.. ముంపు ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా వారి ప్రాంతాలను ఆంధ్రాలో విలీనం చేయడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టును మానవ హక్కుల వేదిక మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. పోలవరానికి వ్యతిరేకంగా ముంపు ప్రాంత ప్రజలు ఆంధ్రాలో కూడా పోరాడాలని కోరారు. ఆదివాసీల పోరాటాలకు తమ వేదిక సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి పల్లా త్రినాధరావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. దీని పై సుప్రీంకోర్టులో అనేక కేసులు పెండింగులో ఉన్నాయన్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి రాకుండా నే పనులు చేపట్టడం విచారకరమన్నారు.
గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య మాట్లాడుతూ.. ఆదివాసీలను పోలవరం ప్రాజెక్టుకు బలిచ్చి, తెలంగాణ సాధించుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ‘ముంపు’ సమస్యను తెలంగాణ ఉద్యమకారులు విస్మరించారని విమర్శించారు. ‘‘ఆంధ్రాలో తాడిపుడి, పుష్కర, చాగల్నాడు తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా నాలుగు లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండుతున్నారుు. మిగిలిన మూడులక్షల ఎకరాలకోసం రెండులక్షల మంది ఆదివాసీలను జల సమాధి చేయడం అనాగరికం’’ అని అన్నారు. పోలవరానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో అవిశ్రాంత పోరాటం సాగిస్తామన్నారు.
న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 100 కిలోమీటర్ల దూరాన పారుతున్న గోదావరి నీటిపై ఇక్కడి ఆదివాసీలకు హక్కు లేకుండా చేసేందుకే ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపారని విమర్శించారు.
ఈ ప్రదర్శన, సభలో ఏఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కీసరు బజారు, న్యూడెమోక్రసీ నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వర్లు, ఎస్కె.గౌస్, గడ్డాల. ముత్యాల్రావు, గిరిజన నాయకులు ఆదినారాయణ, నవీన్, న్యాయవాది పాయం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బడా బాబులకే పోలవరం
Published Tue, Nov 25 2014 2:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement