నేటి నుంచి సికింద్రాబాద్, తిరుపతి స్టేషన్లలో సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణంతో పాటే క్యాబ్, పోర్టల్ బుకింగ్ సదుపాయాలను ఐఆర్సీటీసీ( ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్) అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు రైలు దిగిన వెంటనే పోర్టర్, క్యాబ్ సర్వీసుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఐఆర్సీటీసీయే కొత్తగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. శనివారం నుంచి సికింద్రాబాద్, తిరుపతి రైల్వేస్టేషన్లలో ఈ సేవలు అమల్లోకి రానున్నాయి. త్వరలో విజయవాడ,గుంటూరు రైల్వేస్టేషన్లలో కూడా ఈ సేవలను ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి 36 గంటలు ముందు ఐఆర్సీటీసీ ఆన్లైన్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఆర్సీటీసీ.కో.ఇన్’ లేదా ‘డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ. ఐఆర్సిటీసీ టూరిజం.కమ్.’ సైట్లలో క్యాబ్, పోర్టర్లను బుక్ చేసుకోవచ్చు.
రెండు రకాల సేవలను కలిపి లేదా విడివిడిగా బుక్ చేసుకోవచ్చు. అనంతరం ప్రయాణికులకు ట్రైన్ దిగిన వెంటనే క్యాబ్, పోర్టర్ సర్వీసుల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్, ఇతర వివరాలు రైల్వే సిబ్బంది తెలియజేస్తారు. అంతేకాకుండా స్వయంగా క్యాబ్, పోర్టర్లను ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో,ఏపీ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. అలాగే తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద న్యూఢిల్లీ, సికింద్రాబాద్, విశాఖపట్నం,ముంబై నుంచి వచ్చే రైళ్లకూ ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అన్ని రైళ్లకు క్యాబ్,పోర్టర్ సదుపాయాలను విస్తరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు.
ఇక రైలుతోపాటే క్యాబ్
Published Sat, Feb 21 2015 2:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement