సాక్షి, హైదరాబాద్: గతంలో అనుమతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేయని కంపెనీల నుంచి భూములు వెనక్కి తీసుకుంటామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ మార్గదర్శకాలు ఈ నెల 12న విడుదలవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు అవసరాలకు మించి భూములు కేటాయించి, ఆ తర్వాత పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించలేదన్నారు. భూములు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి ఇప్పటికే నోటీసులు జారీచేసినట్లు వెల్లడించారు. ఆయన మాటల్లోనే...
♦ గతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ అతి పెద్ద సమస్యగా ఉండేది. రాష్ట్రంలో ప్రస్తుతం టీఎస్ఐఐసీ ద్వారా 1.65 లక్షల ఎకరాలను పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకే భూములు పొందే అవకాశం ఉంది. విద్యుత్, నీటి సమస్యలు లేకపోవడం, భౌగోళికంగా, వాతావరణపరంగా తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనువైన వాతావరణం ఉంది.
♦ నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని జిల్లాల్లోనూ ‘స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు’ ఏర్పాటు చేస్తాం. సాంకేతిక విద్యలో నాణ్యత పెంచేలా విద్యా విధానం రూపకల్పన జరుగుతోంది. లైఫ్సెన్సైస్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్, జెమ్స్ అండ్ జువెలరీ తదితర 14 రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నట్లు గుర్తించాం. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు వసతుల కల్పనపై దృష్టి సారించాం.
♦ ఫార్మా, లైఫ్సెన్సైస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించినందున ఆయా పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. పెట్టుబడుల కోసం రాష్ట్రాల నడుమ పోటీ ఉన్నా పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ ముందుంటుంది.
♦ ప్రయోగాత్మకంగా గత జనవరి నుంచి ప్రారంభించిన టీఎస్ఐపాస్కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్రస్థాయిలో 164 దరఖాస్తులు రాగా, రూ.6 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది జూన్ 2 నుంచి ఇప్పటి వరకు జిల్లాల్లో 5 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు అందాయి.
♦ ఈ నెల 12న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన పారిశ్రామిక విధానం మార్గదర్శకాల విడుదల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. టీఎస్ఐపాస్ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంగా మారబోతోంది.
అమెరికాలో సదస్సుకు జూపల్లి
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ నెల 15 నుంచి 18వరకు జరిగే ‘యుఎస్ బయో 2015’ సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్కుమార్, టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి ఆయనతో పాటు వెళ్లనున్నారు. ప్రభుత్వం చేపట్టిన బయో, పారిశ్రామిక విధానాలను ఈ సదస్సులో వివరించనున్నారు.
పరిశ్రమలు స్థాపించని భూములు వెనక్కి
Published Thu, Jun 11 2015 5:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement