గద్వాల: జిల్లాలో ఉన్న ఏకైక భారీ సాగునీటి ప్రాజెక్టు అయిన జూరాల రిజర్వాయర్లో ఏటా పూడిక పేరుకుపోతోంది. 18ఏళ్లలోనే రెండు టీఎంసీల మేర ఒండ్రుమట్టి పేరుకుపోయినట్లు ఏపీఈఆర్ఎల్(ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ)తేల్చింది. పూడిక పెరిగిపోతే డెడ్స్టోరేజీలో ఉండే ఐదు టీఎంసీల నీటినిల్వ కూడా పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి అవసరాలకు వేసవిలో నీటిని నిల్వచేసుకునే అవకాశం లేకుండాపోతుంది.
ఒకవేళ దాహార్తీ తీర్చాలని అధికారులు భావిస్తే.. జూరాల ఆయక ట్టు పరిధిలోని రబీ సీజన్ను క్రాప్హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇంతకుమించి కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు రీజనరేట్ వాటర్పైనే తాగునీటికి ఆధారపడాల్సి వస్తోంది.. జిల్లాలోనే దాదాపు 110కి.మీ పొడవున జీవనది కృష్ణమ్మ ప్రవహిస్తున్నా.. మరమ్మతులు, ఆధునీకకరణ చేపట్టలేకపోయారు.
ప్రాజెక్టు నిర్మాణం కేవలం ఐదేళ్లలో రూ.73కోట్ల వ్యయంతో పూర్తిచేయాల్సి ఉండగా, నిధుల కేటాయింపులో కూడా వివక్షత చూపారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 17.84టీఎంసీల నికరజలాలను వాడుకునే విధంగా ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల కర్ణాటకలో ముంపు పెరగకూడదనే ఉద్ధేశంతో కేవలం లక్ష ఎకరాలకే ఆయకట్టు ఉండేలా డిజైన్ను రూపొందించారు. ఇలా జిల్లాలో ఉన్న ఏకైక పెద్ద ప్రాజెక్టుతో కరువునేలలో ఆశించినస్థాయిలో ప్రయోజనం లేకపోవడంతో ఎత్తిపోతల పథకాలు తెరపైకి వచ్చాయి.
తాగునీళ్లు కష్టమే!
జూరాల ప్రాజెక్టుకు కేటాయించింది 17.8 టీఎంసీలు కాగా, డిజైన్ను కేవలం 11 టీఎంసీల నీటినిల్వకే కుదించారు. ఇందులో డెడ్స్టోరేజీ ఐదు టీఎంసీలు కాగా, మిగతా ఆరు టీఎంసీలు మాత్రమే ఆయకట్టుకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం రిజర్వాయర్లో రెండు టీఎంసీల మేర ఒండ్రుమట్టి పేరుకున్నట్లు ఏపీఈఆర్ఎల్ తేల్చడంతో డెడ్స్టోరేజీలో కేవలం మూడు టీఎంసీలే మిగులుతాయి. ఇలాగే ఒండ్రుమట్టి పెరిగిపోతూ మరో మూడు టీఎంసీలకు పెరిగితే డెడ్స్టోరేజీలో తాగునీటి అవసరాలకు సైతం నీరు కేటాయించే అవకాశం ఉండదు.
ఒండ్రుమట్టి పెరిగినా స్పిల్వేకు..
జూరాల రిజర్వాయర్లో ఒండ్రుమట్టి స్పిల్వే లెవల్ 310మీటర్లకు చేరినా ఆయకట్టు నీటి విడుదలకు ఖరీఫ్లో పెద్దగా ఇబ్బంది ఉండదు. రబీ సీజన్లో మాత్రమే కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో రబీ ఉంటేనే మనకు నీటివిడుదల అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో రబీకి నీళ్లిచ్చే అవకాశం ఉండదు. ప్రధానకాల్వలకు జూరాల రిజర్వాయర్ నుంచి 312మీటర్ల నుంచి నీటి మళ్లింపు ఉంటుంది. కావునా భవిష్యత్తులోనూ ఒండ్రుమట్టి పెరిగితే తాగునీటి అవసరాల మినహా సాగునీటికి సమస్య ఉండదని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.
జూరాల.. నీరెలా?
Published Mon, Oct 20 2014 3:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement