కల్లూరు ఏఎస్‌ఐ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కల్లూరు ఏఎస్‌ఐ ఆత్మహత్య

Published Sat, May 16 2015 2:38 PM

kallur ASI suicide

ఖమ్మం: ఓ ఏఎస్‌ఐ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. వివరాలు... ఖమ్మం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐ గా పనిచేసే గుర్రం వెంకటేశ్వరరావు(48) ఈ నెల 13న కల్లూరుకు బదిలీ అయ్యారు. తర్వాత ఆయన 13న కల్లూరు స్టేషన్‌లో చార్జ్ తీసుకుని సెలవుపై వెళ్లారు. ఖమ్మంలోని ఇంటి దగ్గర ఉన్న ఉదయం నగరంలోని శ్రీనివాసనగర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement