జగన్‌ పాదయాత్రలో కల్యాణ్‌రాజ్‌ | Sakshi
Sakshi News home page

జగన్‌ పాదయాత్రలో కల్యాణ్‌రాజ్‌

Published Thu, Mar 29 2018 10:47 AM

Kalyan Raj In Ys Jagan Padayatra - Sakshi

జనగామ అర్బన్‌ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో ఆ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్‌ బుధవారం పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌తో కలిసి గుంటూరు జిల్లా నార్నెపాడు క్రాస్‌ వద్ద 11 కిలోమీటర్ల దూరం వరవకు పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కల్యాణ్‌రాజ్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement