హంతకులు పోలీసులకు సవాల్ విసిరారు. హత్యలు చేసి దర్జాగా తప్పించుకున్నారు. ఆనవాళ్లూ లభించకపోవడంతో హతులెవరో కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. ఇటీవల కామారెడ్డి డివిజన్లో ఇద్దరు మహిళల మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే. హంతకులు మృతదేహాలను కాల్చి బూడిద చేయడంతో పోలీసులు హతులెవరో కూడా కనిపెట్టలేకపోయారు.
* పోలీసులకు సవాల్ విసిరిన హంతకులు
* ఆనవాళ్లు దొరక్క.. మృతదేహాలనూ గుర్తించలేక..
* ముందుకు సాగని దర్యాప్తు
కామారెడ్డి : పట్టణానికి సమీపంలోని టేక్రియాల్ శివారులో జాతీయ రహదారిపై పోలీసులకు గత నెల 30న ఓ మహిళ మృతదేహం కనిపించింది. కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం పడి ఉంది. ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులకే ఇదే రీతిలో దహనం చేయబడిన మరో మహిళ మృతదేహం సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో లభ్యమైంది. రెండు మృతదేహాలు ఒకే రీతిలో దహనం చేయబడి ఉండడంతో రెండు హత్యలు ఒకే రోజు జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒకే ముఠా ఈ హత్యలకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.
జాతీయ రహదారిపై ఒక మహిళ శవం పడి ఉండడం వల్ల ఆ రోజు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లిన వాహనాలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. ఇందల్వాయి, తూప్రాన్ టోల్గేట్ల నుంచి నిఘా కెమెరాల క్లిప్పింగులను తెప్పించి పరిశీలిస్తున్నారు. అదృశ్యం అయిన మహిళల వివరాల కోసం కూడా పోలీసులు జిల్లాతో పాటు పొరుగు జిల్లాలన్నింటికీ సమాచారం పంపించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో హత్యలు మిస్టరీగా మారాయి. ఎక్కడో హతమార్చి, వాహనాల్లో తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చి ఉంటారని భావిస్తున్నారు. దీంతో మృతులెవరో గుర్తు పట్టలేకపోతున్నారు. హతులు, హంతకులు ఇదే జిల్లాకు చెందిన వారా, లేక ఇతర జిల్లాలకు చెందిన వారా అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కరడుగట్టిన నేరస్తుల పనేనా...
ఈ రెండు హత్యలకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. మహిళలను హతమార్చి, పెట్రోల్ చల్లి నిప్పంటించడం కరడుగట్టిన నేరస్తులకే సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. మృతదేహానికి నిప్పంటించి, పూర్తిగా కాలిపోయిన తర్వాతనే హంతకులు అక్కడి నుంచి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. హత్యకు గురైన మహిళలు ఎవరో తెలిస్తే కానీ హంతకులను పట్టుకోవడం సాధ్యం కాదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద కేసులను సైతం తక్కువ సమయంలో ఛేదించడం ద్వారా తమ సత్తా చాటుకున్న పోలీసులకు ఈ రెండు హత్యల మిస్టరీని ఛేదించడం సవాల్గా మారింది.
మర్డర్ మిస్టరీలు వీడేనా!
Published Tue, Oct 21 2014 4:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement