రోడ్డు ప్రమాదంలో కర్ణాటక భక్తులకు గాయాలు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కర్ణాటక భక్తులకు గాయాలు

Published Mon, Jul 27 2015 2:00 PM

karnataka devotees injured in road accident

చివ్వెంల(నల్లగొండ): నల్లగొండ జిల్లా చివ్వెంల మండలంలోని విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన భక్తులు తుఫాను వాహనంలో గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా చివ్వెంల మండలం గుందలూరు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తుఫాను బోల్తా పడటంతో వాహనంలో ఉన్న ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement