హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ను కైవసం చేసుకున్న హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభినందనలు తెలిపారు. స్పెయిన్కు చెందిన కరోలిన మారిన్తో ఆదివారం సిడ్నీలో జరిగిన టైటిల్ పోరులో సైనా నెహ్వాల్ ఘన విజయం సాధించింది. భవిష్యత్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ అభిలషించారు.
భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ నిన్న జరిగిన ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్లో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో సైనా 21-18, 21-11 తేడాతో కరోలినా మారిన్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించింది. ఈ తుదిపోరు కేవలం 43 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. ఈ ఏడాది ఆమెకు ఇది రెండో టైటిల్.