హరిప్రసాద్ కుటుంబానికి రూ. 2 లక్షల సాయం | Sakshi
Sakshi News home page

హరిప్రసాద్ కుటుంబానికి రూ. 2 లక్షల సాయం

Published Thu, Jan 22 2015 1:11 AM

KCR announces Rs 2 lakhs financial help for Journalist hari prasad family

పార్టీ తరఫున ప్రకటించిన మంత్రి కేటీఆర్
 సాక్షి, హైదరాబాద్: గుండెపోటుతో మంగళవారం మృతిచెందిన జర్నలిస్టు పసుపులేటి హరిప్రసాద్ (46) కుటుంబానికి టీఆర్‌ఎస్ పార్టీ రూ. 2 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. హరిప్రసాద్ మరణానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు సంతాపం తెలిపారు. ప్రసాద్ కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని, తక్షణమే రూ. 2 లక్షలు అందజేస్తామని మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, హరిప్రసాద్ అంత్యక్రియలు నల్లగొండ జిల్లా దేవరకొండలో గురువారం నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
 

Advertisement
Advertisement