'వీసీల నిమామక ప్రక్రియ వేగవంతం చేయండి' | Sakshi
Sakshi News home page

'వీసీల నిమామక ప్రక్రియ వేగవంతం చేయండి'

Published Wed, Feb 19 2020 2:04 PM

KCR Orders Officials About Appointment Of Vice Chancellors In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో వైస్‌ చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. వీసీ నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుంచి పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.దీనివల్ల వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు.రాబోయే రెండు-మూడు రోజుల్లోనే ఇదంతా జరగాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement