♦ కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన సీఎం కేసీఆర్
♦ జాతీయ రహదారులకు లిఖితపూర్వక అనుమతులివ్వాలని వినతి
♦ భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి తుమ్మల
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి పలు జాతీయ రహదారులను ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదని, అందుకు సంబంధించిన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ సోమవారం గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు అంశాలపై గడ్కరీతో చర్చించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి గతంలో సమర్పించిన డీపీఆర్లకు ఇంకా అనుమతులు రాలేదని... రహదారుల అథారిటీకి అప్పగించిన డీపీఆర్లకు అనుగుణంగా భూసేకరణకు అనుమతు లివ్వాలని కోరారు. రాష్ట్రంలో నాలుగు జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా వెడల్పు చేయడానికి అనుమతుల మంజూరుపైనా చర్చించారు. అలాగే రాష్ట్రంలో నాలుగు ప్రధాన రహదారులను (సంగారెడ్డి– చౌటుప్పల్ 152 కి.మీ, చౌటుప్పల్–కండి 186 కి.మీ, మెదక్–ఎల్కతుర్తి 133 కి.మీ, హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు–కొత్తగూడెం 234 కి.మీ) జాతీయ రహదారులుగా ప్రకటిస్తూ వెంటనే అనుమతులు, ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.హైదరాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఎన్హెచ్–44ను విస్తరించాల్సి ఉందని, ఇందులో కొంత స్థలం రక్షణ శాఖ పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నందువల్ల అందుకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
అనంతరం సమావేశ వివరాలను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 650 కిలోమీటర్ల పొడవైన కొన్ని రహదారులను జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించామని, వాటి నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉందని, కేంద్రం నుంచి త్వరగా అనుమతులిస్తే వాటి పనులు ప్రారంభిస్తామని తెలిపామన్నారు. గోదావరి నదిపై ఇన్లాండ్ వాటర్ వే వ్యవస్థ, డ్రైపోర్టుల ఏర్పాటు గురించి కూడా సీఎం కేసీఆర్ గడ్కరీతో చర్చించారని తుమ్మల తెలిపారు. ఈ అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని... అనుమతుల మంజూరుకు వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. గడ్కరీని కలసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రాంచంద్రు తేజావత్, ఎంపీలు జితేందర్రెడ్డి, వినోద్ కుమార్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ ఉన్నారు.
పెండింగ్ రోడ్ల పనులు వెంటనే చేపట్టండి
Published Tue, Nov 22 2016 2:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement