కేతేపల్లి : విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ను దూషించి, అతడి విధులకు ఆటంకపరిచాడన్న అభియోగంతో అధికారపార్టీ మండల అధ్యక్షుడిపై బుధవారం కేతేపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భీమారం గ్రామానికి చెందిన కోట ఈదమ్మకు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆసరా పింఛన్ మంజూరు కాలేదు. ఇందుకు స్థానికంగా ఉన్న టీడీపీ నేత, వైస్ ఎంపీపీ కోట ము త్తయ్య కారణమంటూ ఆమె మనువడు కోట శ్రీనివాస్ మంగళవారం జరిగిన గ్రామసభలో వారిని దూషించా డు. దీంతో ఆగ్రహించిన ముత్తయ్య బుధవారం శ్రీనివాస్పై కేతేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కౌం టర్గా కోట ఈదమ్మ పేరిట రాసిన ఫిర్యాదును కోట శ్రీనివాస్ తమ్ముడు కిరణ్ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చాడు.
ఈసమయంలో స్టేషన్లో గార్డు డ్యూటీలో ఉన్న హెడ్కానిస్టేబుల్ యాట రమేష్ ఫిర్యాదును పరిశీలించా డు. బాధితులు లేకుండా ఫిర్యాదు తీసుకోమని స్పష్టం చేశాడు. దీంతో కిరణ్ పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్కు తెలిపాడు. ఈ విషయమై పోలీస్స్టేషన్కు వచ్చిన శ్రీనివాస్యాదవ్ హెడ్కానిస్టేబుల్తో వాదనకు దిగాడు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ అతడిపై దాడికి పాల్పడ్డాడు. సంఘటనపై రమేష్ చేసిన ఫిర్యాదు మేరకు నల్లగొండ డీఎస్పీ బి.రాములునాయక్ సాయంత్రం కేతేపల్లి పోలీస్స్టేషన్ సందర్శించారు.
ఎస్ఐ శ్రీనివాస్తో పాటు విధినిర్వహణలో ఉన్న సిబ్బందిని వ్యక్తిగతంగా విచారించి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ హెడ్కానిస్టేబుల్ విధులకు అటంకం కలిగించిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ను పట్టుకునేందుకు బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు. డీఎస్పీ వెంట నకిరేకల్ రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ ఎ.శ్రీనివాస్లు ఉన్నారు.
కానిస్టేబుల్ను దూషించాడంటూ..
Published Thu, Jan 8 2015 4:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement